పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మేల్కాంచిన సమయంబున హరి పుసస్సృష్టి సేయింప
నుద్యుక్తుండై శ్వేతవరాహరూపంబు ధరించి మహాజలంబునం
బ్రవేశించి రసాతలంబున కేగి భూమిని పైకెత్తుసమయంబునఁ
గాంచనాక్షుండు కోపోద్రేకుండై యడ్డంబు వచ్చి యుద్ధంబు
సేయ నాదుష్టుని నిజదంష్ట్రాంగంబున శిరంబు ఖండించి
తద్రక్తంబునం గలసిన ప్రళయజలంబు రక్తతోయంబు
కరణిం బొడకట్టినం జూచి జనలోకనివాసులు వెఱఁగంది నిజ
యోగదృష్టిం జూచి హరి క్రోడాకారుండై చేసినకృత్యంబు
తెలిసి తత్ప్రభావంబును వినుతించు చున్నసమయంబున
శ్వేతవరాహస్వామి నిజదంష్ట్రాంగంబున భూమిం గ్రుచ్చి
మీఁదికెత్తి దెచ్చినం జూచి దేవేంద్రాదులు వరాహస్వామికి
బ్రణామంబు లాచరించి భేరీ మృదంగాది వాద్యంబుల
మ్రోయించి సుమసృష్టి గుఱియించి యనేకప్రకారంబులఁ
బ్రస్తుతంచి యి ట్లనిరి.

47


ఆ.

హరి వరాహరూపుఁ డై దానవుని జంపి
యవని నిలకుఁ దెచ్చి నట్టిదిట్ట
నీర యవని నమర నిల్పు మీనీటిపై
ననఁగ యజ్ఞఘోణి హర్ష మెసఁగ.

48


వ.

నిజఖురంబుల మహాజలంబు నడంచి చదరంబు సేసి యానీటిపై
భూమిం గుదురుగ నిల్పి జనలోకవాసు లైనదేవేంద్రాదుల
నాదరించి యథాప్రకారంబుగ మీస్థానంబుల నుండుఁ డని
నియమించి బ్రహ్మను మేల్కొల్పి పూర్వప్రకారంబుగ
సృష్టిం జేయుమని యాజ్ఞాపించి వీడ్కొని తలంగి సన్ని
హితుండై మ్రొక్కుచున్న పక్షీంద్రుం జూచి యిట్లనియె.

49