పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

శ్రీరంగమాహాత్మ్యము

గీ. అరఘడియలోన నన్నిపదార్థములును, చెట్టుచే తినిపించె సిద్ధయోగి
      మరియు దైవంబులో నీళ్ళు ధరణిఁ జల్లి, నంది గొనిపోవు భక్ష్యభోజ్యంబు లెల్ల.
క. అనుచు కరంబులు మొగిడిచి, మునులందఱుఁ జూచునెడ బ్రమోదాత్మకులై
      జనపతి కదంబశాఖిన్, గని వినుతించె న్ముదశ్రుకణములు దొరుఁగన్.
సీ. ధ్యాన ముర్వీరుహోత్తమసార్వభౌమున కావాహనము కుటజాగ్రమణికి
      కనకాసనము బాగణపట్టభద్రున కర్ఘ్యంబు సాలవంశాధిపునకు
      తరుషండచూళికాభరణంబునకు పాద్య మగశేఖరునకు భూపార్చనంబు
      దీపమనోహకాదిమకీర్తనీయున కలరు దోయిళ్ళు నగాధిపతికి
      వృక్షహర్యక్షమునకు గంధాక్షతంబు, వరుస నైవేద్యములు లతావల్లభునకు
      హరికి సాష్టాంగములు కదంబాఖ్యామూర్తి, కభినుతులు మీఁదనున్న మహాత్మునకు.
గీ. అనుచు నానావిధంబుల నభినుతింపఁ, జెట్టుతోఁ గూడి నయ్యోగిశేఖరుండు
      వెరుగుమై రాజు మునులును వినుచునుండఁ, బుట్టె నొకమాట యమ్మహాభూరుహమున.
క. మీనుతులచేత నలకితి, యేనందితి మీర లిప్పు డిచ్చినపూజల్
      మీనేరముచే సవనము, హానిం జెందెనని తెల్పె నత్తెరఁ గెల్లన్.
క. ప్రారంభిం చిపుడులకందతలు, దీరె హవిర్భాగములకు దివిజులు మింటన్
      బారులు దీరిచి మంత్రము, లారూఢము లయ్యె మీహృదాబ్జంబులతోన్.
క. యాగంబు దీర్పుఁ డే నృపు, రాగము నొందించి నిజపురము జేర్పుదువే
      వేగనని యూరకున్నను, ధీగణములతోటి కలకదేరిన బుద్ధిన్.
ఉ. ఆమహనీయయాగము సమాప్తి యొనర్చి కృతార్థచిత్తులై
      భూమివరేణ్యుచే నలఘుపూజలు గైకొని హేమరత్నభూ
      షామహితాంబరావళుల సత్కృతి జేసిన నంది యమ్మహా
      భూమిరుహంబుచెంత మునిపుంగవు లున్నెడ నద్భుతంబుగన్.
గీ. చెట్టులో దూరి డాగినయట్టి యోగి, కొమ్మగుప్పున వెలువడి గోచరించి
      యిలకు డిగి బ్రహ్మతేజంబు బర్వ, శిష్యులును దాను యెవ్వారిచెంతఁ జనక.
సీ. ఒకరికంటికి రాజయోగియై కనుపట్టి యొకరిచూడ్కికి మౌని యొరపుఁ దాల్చి
      యొకరిభావమునకు నుర్వీసురత నిల్చి యొకరిడెందమున దేశికతఁ దోఁచి
      యొకరి కీతఁడు శౌరియురగాయు డనిపించి యొకరికి రంగనాయకతఁ జూపి
      యొకరి కీతఁడె బ్రహ్మమొకొ సత్యమనిఁ జాటి యొకరికి యీశ్వరుఁడను యూహ నొసఁగి
      యందరికి నన్నిరూపులై యరుగునపుడు, కణ్వశరభంగకాశ్యపగౌతమాది
      మునులు వలగొని యచటికి జనెదరయ్య, మీకు పేరేమి యెందుండి రాక మొదట.