పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

77


శివనిందా దోషము ధర
భవముల నొందింప దధికపాతక మగుటన్
రవితనయు లోకమందున
నివసించును కల్పకోటి నిరయములోనన్. 165

అయినను మీరలు నతిభక్తి నీ విష్ణు
          శిఖరాగ్రవాసుని శ్రీ సహాయు
పరమేశు సద్భక్త పరిపాలనాక్షీణ
         కరుణాకటాక్ష వీక్షణునిఁ జక్రి
పరమాత్ము నవ్యయు గరిమ సేవించితి
         రవ్విష్ణునకు నాకు నరయ భేద
మించుకంతయ గల్గదే నొక్కడనే బ్రహ్మ
        విష్ణురుద్రాకృతి వెలయుచుందు
నట్టి విష్ణునగాధీశు నద్రిమీఁద
నెసఁగ నుపదేశమగుచుఁ గోటీశు నన్ను
మనసులో నిల్పి యతినిష్ఠ ఘనతపంబు
జేసితిరిగాన నఘముక్తి చెందు నిపుడు.166

అనిపల్కి శివుఁడు శూలం
బున పంకజనేత్రు శిఖరమూలముఁ బొడువన్
జనియించె నిర్మలోదక
ఘనమగు దొన యొకటి పాపఖండన యగుదున్.167

అంత వారలఁ జూచి కాలాంతకుండు
పాపనాశని యను పేరఁ బరగు నిదియు
నిచట మునిఁగిన మీ పాపమెల్ల బొలియు
నిందుఁ బొలియని పాపంబు లెందు లేవు..168