పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

పరాశరమాధవీయము 31వ పుట భవిషోత్తరపురాణమునందు

నకేవలం బ్రాహ్మణానాం-దానం సర్వతశస్యతే
భగినీ భాగినేయానాం మాతులానాం పితృష్వసు:
దరిద్రాణాంచబంధూనాం దానంకోటిగుణంభవేత్

ఈ శ్లోకము పలన సకల సందేహములును నివృత్తియగుచున్నవి.

ఇందులో నిజమైన యర్ధము అన్ని కర్మల యందును బ్రాహ్మణులకే దానము చేయుట ప్రశస్తము కాదు.

తోబుట్టువు- తోబుట్టువు కొడుకు మేనమామ. మేనత్త - దరిద్రులు - ఇంకను ఇటువంటి బంధువులు - వీరికిచేసినదానము కొన్ని యెడల బ్రాహ్మణులకు జేసిన దానమునికంటే కోటిగుణిత మైన ఫలమిచ్చును.

యెల్లకర్మల యందనుటచేత కొన్నింటియందు బ్రాహ్మణులు మాత్రమే ప్రతిగ్రహీతలనుట నిశ్చయమే కాని కొన్ని ట క్షత్రియ వైశ్యులు వారిలో వారి బంధువులే, ప్రతిగ్రహీతలైనచోనుత్తమపక్షమని ఈ శ్లోకము వక్కాణించుచున్నది,

భో క్తలకిచ్చువస్త్ర పాత్రాదుకులౌపచారకములు
క్షత్రియవైశ్యులలో భోక్తలుగా నుండువారు బంధువులే.
భోక్తలకిచ్చు దక్షిణ శ్రాద్ధసాద్గుణ్యార్ధమైనది.

కావుననిందు బ్రతిగ్రహణమేమున్నది. ఒకవేళ అది యున్నను నిపిద్దమేలయగును ?