Jump to content

పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

ఇందునకు బ్రమాణములు-

"వైశ్యధర్మదీపిక" యందు 5వ సూత్రము [ఆపదీతరేపి)వివరించుటతో వ్రాయబడినవి. గౌతమసంహిత [యాజనాధ్యాపన ప్రతి గ్రహా సర్వేషాం.]

శ్రాద్ధేషురాడ్విశోర్విప్ర - యాజకత్వస్యముఖ్యతా:
వివృతా దాసువంశాబ్ది - శశినా రామశర్మణా॥

విప్రయాజకత్వముఖ్యతా విచారట్టము సమాప్తము.

శ్లో.

నిర్లేపోనిరహంకారో నిరాలంబో నిరుత్తమః|
శివోహం లోకదీక్షాయాం - భావయే పార్వతీపతిం॥

6.క్షత్రియ వైశ్యభోక్తృణాం ప్రతిగ్రహణ విచారఘట్ట:

:- స్వసిద్దాంతములు :-

1.యాజకుడు వేరు, భోక్తవేరు.

యాజకుడు కర్మచేయించువాడు. కర్మచేయువాడు యజమానుడు లేక కర్త, అన్నమును భుజించువాడు భోక్త.

2.భోక్తకు ప్రతిగ్రహణముతో బనిలేదు కాని యువచారములయందును సాద్గుణ్యార్ధమగు దక్షిణయందును ప్రతిగ్రహణయోగ్యత గలదు ఏలననగా

బ్రహ్మచర్య భిక్షాపతిగ్రహణము, ఔపచారికద్రవ్య ప్రతిగ్రహణము, కన్యాప్రతిగ్రహణము, సాద్గుణ్యార్థ దక్షిణా ప్రతిగ్రహణము ఇవి క్షత్రియవైశ్యులకును అధవా శూద్రులకును విహితములే.