పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

ఇందునకు బ్రమాణములు-

"వైశ్యధర్మదీపిక" యందు 5వ సూత్రము [ఆపదీతరేపి)వివరించుటతో వ్రాయబడినవి. గౌతమసంహిత [యాజనాధ్యాపన ప్రతి గ్రహా సర్వేషాం.]

శ్రాద్ధేషురాడ్విశోర్విప్ర - యాజకత్వస్యముఖ్యతా :
వివృతా దాసువంశాబ్ది - శశినా రామశర్మణా ॥
విప్రయాజకత్వముఖ్యతా విచారట్టము సమాప్తము.

శ్లో. నిర్లేపోనిరహంకారో నిరాలంబో నిరుత్తమః|
శివోహం లోకదీక్షాయాం - భావయే పార్వతీపతిం ॥

6. క్షత్రియ వైశ్యభోక్తృణాం ప్రతిగ్రహణ విచారఘట్ట :

:- స్వసిద్దాంతములు :-

యాజకుడు వేరు, భోక్తవేరు.

యాజకుడు కర్మచేయించువాడు. కర్మచేయువాడు యజమానుడు లేక కర్త, అన్నమును భుజించువాడు భోక్త. | 2. భోక్తకు ప్రతిగ్రహణముతో బనిలేదు కాని యువచారములయందును సాద్గుణ్యార్ధమగు దవీణయందును ప్రతిగ్రహణయోగ్యత గలదు ఏలననగా

బ్రహ్మచర్య భిక్షాపతిగ్రహణము, ఔపచారికద్రవ్య ప్రతిగ్రహణము, కన్యాప్రతిగ్రహణము, సాద్గుణ్యార్థ దక్షిణా ప్రతి గ్రహణము ఇవి క్షత్రియవైశ్యులకును అధవా శూద్రులకును విహితములే.