ద్వితీయాశ్వాసము
63
సీ. కమనీయసురసభాగారమధ్యమునకు
దీపించు మాణిక్యదీప మనఁగ
రంభాదిదేవతారంభోరువుల కెల్లఁ
జారుచూడావతంసం బనంగ
జగములు గెలువంగ సానఁబట్టించిన
రతిరాజునవఖడ్గలతిక యనఁగ
యతులమానసము లుద్దృతుల నాకర్షించు
పరవశయమంత్రదేవత యనంగఁ
తే. బంత మాడిన హరినైనఁ బద్మభవుని
నైన హరునైన మోహరసాబ్ధిఁ ద్రోచి
యీఁదు లాడింపనోపెడు నిగురుఁబోఁడి
మేనకాసతిఁ జూచి సన్మాన [1]మొసగి.119
వ. సకలసౌభాగ్యసౌందర్యమందిరంబగు నీచేతంగాని గాధినందనుతపంబు
విఘ్నంబు గానేరదు. శీఘ్రంబ చని యమ్మౌనివరుని మరుని యాజ్ఞకు
లోను చేసి రమ్మనిన మహాప్రసాదం బని యక్కొమ్మ పాకశాసను శాస
నంబునఁ గౌశికు తపోవనంబునకు వచ్చిన వియచ్చరపతి యాజ్ఞ నయ్య
చ్చరమచ్చెకంటి వెనుకొని.120
శా. ఏతెంచె న్మధుమాసలక్ష్మి, తరుణీహిందోళరాగధ్వను
ల్వీతెంచె, న్బటుమీనకేతనముతో విల్లంది పూఁదేరిపై
దోదేంచె, న్దలిరాకుఁ గైదువులుఁ దోడ్తోఁ దాల్మి లేఁదీగల
న్వేతెంచె న్జగదేకవిక్రమకళావీరుండు మారుం డొగిన్.121
ఉ. వామనదిగ్గజంబు మదవాసనకుం జన కోహటించు ను
ద్దామగతి న్నభోమణిరథంబు హయంబు లనూరుఁ డుద్ధతుం
డై మగుడింపఁగా మగుడ కడ్డము దాఁకె ననంగ నుత్తరా
శాముఖవీథి నేగె దివసంబులు దీర్ఘత పల్లవింపగన్.122
- ↑ మెసఁగి