పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 53

లి
క్కలకంఠుల్భువి సాభిమానలని వక్కాణించితిం గానిదో
షలతాదోహదలై ప్రవర్తిలుట యోజం గానలేనైతిగా. 207

వ. అని బహువిధంబుల వితర్కించి. 208

క. రెండొకటిగఁ గంటిఁగదా
దండించుట నీతి యాౌఁగదా యని కడును
ద్దండతరచండమతియై
ఖండా యొఱడుస్సివైచి కర మెత్తుటయున్. 209

తే. మును గళావంతుఁ డానతిచ్చినసుభాషి
తము లిఖించినచీటి దోర్దండచండ
మండలాగ్రంపుటొఱలోన మాటియుండె
గాన నది నేల వ్రాలుటఁ గని యతండు. 210

క. ఇది యేమో యని కేలం
గదియించి ప్రదీప్తదీపకళిక వెలుఁగునం
జదువుచుఁ బ్రాక్తనవిద్వ
త్ప్రదనీతిశ్లోక మగుట భావించి వెసన్. 211

తే. “అతిరయంబున నొకకార్య మాచరించు
నతనియవివేక మఖిలాపదాస్పదంబు
తెలిసి సత్కార్యభాగవర్ధిష్ణుఁడైన
ప్రాజ్ఞుఁడు కృతప్రలబ్ధసంపదలఁ బొదలు.” 212

వ. అని యివ్విధంబునం గననైనఁ దచ్ఛ్లోకం బరసి నిజవధూమణిం దిలకించిన. 213