పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 49

క. పరికరముల మంకెనలును
బరిచారకు లరిదిపనులపట్టుగుడారుల్
సరిబేరు లైనగౌరలు
దొరయం జనవిఫ్రుఁ డతనితో నిట్లనియెన్. 189

క. చనుము బహుశ్రేయస్థితిఁ
గని పునరావృత్తి మహిమ గలిగి శుభాప్తిన్
మను మింకొక్కటి తెల్పెద
వినుము మదీయప్రసంగవివశాత్ముఁడవై. 190

తే. అతిరయంబున నొకకార్య మాచరించు
నతనియవివేక మఖిలాపదాస్పదంబు
తెలిసి సత్కార్యభాగవర్ధిష్ణుఁ డైన
ప్రాజ్ఞుఁడు కృతప్రలబ్ధసంపదలఁ బొదలు. 191

మ. అని పల్క న్విని యేతదర్థకృతపద్యం బప్డు తాళీదళం
బున వ్రాయించి మెఱుంగుకత్తి యొఱలోఁ బొందించి తానత్తఱిం
జని పొంతం గనియె న్మహానటజటాఝూటస్ఫురన్నిర్గళ
ద్ఘనధారాపతనప్రకంపితమహాక్ష్మాభాగ భాగీరథిన్. 192

వ. కని యప్పు డప్పుణ్యతరంగిణీజలంబులఁ గృతస్నానదానాద్యనుష్ఠానుండై కృతకృత్యుం డగుచు నచ్చోటివాసి యిలావృతహిరణ్మయరమ్యకభారతప్రముఖబహువిధవర్షంబు లవలోకించి తత్తద్విచిత్రంబుల కాశ్చర్యం బంది యవ్వలం గడచి నడచి యనేక దుర్గవర్గకాంతారమార్గంబు లతిక్రమించి చనునప్పు డప్పురో భాగంబున. 193