పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

434 శుకసప్తతి

ద్భావుల్ మిత్రుడు దేవదత్తుఁడును విద్యాశాలియాద్యుండనన్
గా విఖ్యాతి వహించి భూదివిజలోకశ్రేష్ఠులై నల్గుర
ర్ధావేళ స్పృహతం జరింతురుగకియ్యత్వంబు శూన్యంబుగాన్. 213

గీ. తద్ద్రవిణమెల్లగిలు బాడఁ దలఁచి ధూర్త
విప్రుఁ డొక్కండు వారల వెంటవెంటఁ
దిరిగి తన్మైత్రి వడసె విధేయనామ
ధేయుఁ డరివంచనాపరాత్మీయబుద్ధి. 214

ఉ. అంతట పాండ్యమండలమునందు ద్రువాఖ్య నెసంగు మేదినీ
శాంతుఁడు భూరిదాన మొసగన్ సమకట్టిన విన్నవారలై
సంతసమంది నల్గురు ద్విజన్ములు గూడి విధేయుతోడ న
త్యంతరయంబుమై నరిగి రాదొరయున్నపురంబు సేరఁగన్. 215

వ. ఇవ్విధంబునఁ జేరి. 216

సీ. మంత్రీంద్రులకు వేదమంత్రపూర్వాశీర్వ
భాసురోక్తుల నిమ్మపండ్ల నొసఁగి
యధికారిచెంత వేదాంతభాష్యాది
మాంసాదిసంవాదమహిమఁ జూపి
హితపురోహితు లున్నయిండ్లకుఁ బసపుపం
డ్లును గొనిపోయి బంధుతలు నెఱపి
వాకిట గొల్లల కేకతంబున ధర్మ
తత్త్వమార్గమును బోధన మొనర్చి
గీ. యుడిగములవారికెల్ల మే మున్నవార
మునుచు మంత్రాక్షతల నిచ్చి యనుసరించి
వారు సముఃఖంబు సేర్ప భూవరునిచేతఁ
గైకొనిరి నాల్గువేలరొక్కంబువారు. 217