పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 415

నొంటిగఁ బవ్వళించుటకు నోపక చింత వహింప నంతలో
గంటికి నిద్రవచ్చె గలగంటి భవద్రతి గల్గినట్లుగాన్. 135

తే. వామహస్తము నురముపై వైచి నిదురఁ
జెందుతఱిఁ గానికల గందు రందు రెందు
నవ్విధంబునఁ బవళించి యైనకలయ
గంటి భవదీయకారుణ్యగరిమవలన. 136

క. అని పలుకు దానిమాటలు
విని నిశ్చయ మని తలంచె విభుఁ డోపద్మా
నన యంత నేర్పుగలిగిన
జనవచ్చు నటంచుఁ గీరచంద్రుండు పలికెన్. 137

గీ. ఆప్రభావతి బాగాయె నంచుఁ బలికి
ప్రాగ్దిశాపాండిమము గాంచి పడకయింటి
కరిగి పగలెల్ల ద్రోచి దినాంతవేళ
యధిపసంగమగుతుకమాస్యమునఁ దొలుక. 138

సీ. కలికి చేర్చుక్కయౌ గాదుగా కచభృంగ
భంగపాళికకోరపంక్తిగాని
కస్తూరితిలకమౌ గాదుగా ముఖపద్మ
సక్తశైవాలలేశంబుగాని
రంగులరవికె నారాదుగా కులశైల
గ్రసితనాగేంద్రత్వక్చయముగాని
గతివన్నెచీరెయౌ గాదుగా తనువిద్యు
తాభాదివారివాహంబుగాని
గీ. కనకమేఖలయౌ గాదుగా నితంబ
నవ్యకటిదేశకృతతోరణంబు గాని