పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

410 శుకసప్తతి

సీ. సంతలోఁ బ్రత్తి బిచ్చము లెత్తి నూఱాఱు
వగల జన్నిదములు వడికి వడికి
నికటకాననభూములకు నేఁగి మఱ్ఱియా
కులు దెచ్చి విస్తరుల్ గూర్చిగూర్చి
శాకపుబీజము ల్చల్లి బావులనీరు
చేఁది పోయుచుఁ బైరు చేసిచేసి
వేకువ నంగళ్ల విక్రయవేళల
జాఱిన మిరియంబు లేఱియేఱి
తే. యన్నియును విక్రయించి భార్యాకుమార
ముఖ్యు లాఁకట మ్రొఁగ్గిన మొగముఁజూడఁ
డాసపడి యేమి గోరిన నాగ్రహించు
జందెములు దెంచుకొని తద్ద్విజన్మఖలుఁడు. 117

తే. ఇట్లు గడియించి ధనమెల్ల నింట నునిచి
యతఁడు పరలోక మెనయఁ దదాత్మజుండు
గర్గుఁ డనువాఁడు కౌమారకలితుఁ డగుచుఁ
దరుణగాణిక్యవిహరణాదరణుఁ డగుచు. 118

సీ. కన్నెఱకంపుబింకముఁబోని నేయాలు
వెలఁబెట్టి బలుకు సుద్దులకు లొంగి
రతులకు జాణబేరము లంచు చెలులచేఁ
బరికించు వన్నెచిన్నలకు మఱఁగి
వలచితిరోరి! యీవుల కేమియెడఁబాయ
వలదనుతక్కుమ్రొక్కులకుఁ జిక్కి
సాకటి బిండుగల్ జాతరల్ మొదలుగాఁ
దలపెట్టి గొణుగువింతలకుఁ దగిలి