పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 407

ఇరువదిరెండవకథ

మ. అవనీమండలమండనం బయిన యార్యావర్తదేశంబునం
దు విరాటుం డనురాజు ప్రోవఁ జెలువందుం భద్రకాఖ్యంబుర
ప్రవరం బొక్కటి యందు విప్రకులపారావారహాలాహలం
బవు నీతం డన దేవలాంకుఁ డొకఁ డర్థాపేక్షమై వర్తిలున్. 108

సీ. అపరకర్మాగతంబైన వస్త్రమెగాని
క్రయలబ్ధవసనంబు కానివావి
పూటపూట పరాన్నభోజనంబేకాని
ప్రియభామనిజభుక్తి పెట్టుమందు
దానలబ్ధంబైన తాంబూలమేగాని
చేనున్నవీడెంబు చెడ్డయొట్టు
వితరణులైన భూవిభులవాకిలెకాని
యింక నిజాలయం బెదురుచుక్క
గీ. గాఁగ నూహించు నప్పాపకర్ముఁ డెంత
యర్థకాంక్షయొకాని ధనాఢ్యుఁడయ్యు
జన్మఫలమైన యట్టిసంసారసౌఖ్య
మనుభవింపంగజాలఁ డో యంబుజాక్షి. 109

మ. పితృకార్యంబున నొక్కనింట కడుతృప్తిం జెంది తత్పూజనా
గతపుష్పాదులు ద్రోచి యార్ద్రరసనాంగశ్రాంతి దైన్యస్థితుల్
జతగూడంగ నతండు గేహముల “బిక్షాందేహి" యంచున్ దరి
ద్రత గల్పించుచు తెచ్చి బైక్షము తుదిన్ గయ్యంబు సేయున్ పురిన్. 110