పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 405

స్వాంతత్వముఁ జెందిన త
త్కాంతామణి నడక లెల్లఁగాంచిన యదియై. 98

తే. శాంత శాంతల యయ్యును జతుర యగుట
దీనికి భయంబు చూపినఁ గాని తనకుఁ
బోషణము లేదనుచు డెందమునఁ దలంచి
యోర్చికొనియుండి యంతట నొక్కనాఁడు. 99

చ. జనకునిఁ జేరి యాతనికి సంతసమయ్యెడు మాటలాడి సొం
పెనయఁగ నీవుగాక మఱి యింకొకతండ్రి గలండు నాకుఁ బొ
మ్మని పలుకన్ వినిశ్చలతరాద్భుతుఁడై మదిఁజెందు సందియం
బునఁ దలపోసి యాసచివపుంగవుఁ డెంతయు నాదరంబునన్. 100

తే. ఇంక నొకతండ్రి గలఁడంటి విందువదన
యతనిఁ జూపెదవే యన్న నవ్వధూటి
మంచిదని రేయి చూపెద నంచుఁ బలికి
యవలి కరిగిన నమ్మాట లాలకించి. 101

క. ఆలోలాంగన తగదు
శ్శీలం బిది యెఱిఁగి పతికిఁ జెప్పఁగఁ బూనం
బోలు నని తలఁచి మిక్కిలి
జాలింబడి శాంతఁ బిలిచి సప్రియరీతిన్. 102

తే. అనునయించిన నబ్బాల యైన నేమి
నన్నుఁ బోషించెదేని యెంతయును దప్ప
దాల్తు నని పల్కె నింక నత్తరుణి జనక
భావసంశయమెట్లు పాపంగవలయు? 103