402 శుకసప్తతి
పై సమాసీనఁ గావించి పటహముఖ్య
భద్రవాద్యరవంబు లంబరము నిండ. 81
వ. ఇవ్విధంబున నక్కాంతిమతి నూరేగించి నిజగృహబహిర్భాగంబున గజావరోహణంబు గావించిన యక్కాంతిమతిచేత సాష్టాంగప్రణామపూర్వకంబుగా ననుజ్ఞాతుండై యానృపాలపురుహూతుం డరుగం దక్కినవారలను బాదపరాగంబు ప్రసాదించి వీడ్కొలుపుచు నమ్మందగమన మందిరాంతరంబునకుం బోయి. 82
తే. వరము లిచ్చు మహాపతివ్రత యటంచు
నేతు కాశీపురాంతరక్షితిజనంబు
లచ్చమగు భక్తి గానుక ల్దెచ్చి చూడ
వేళగానక యుండఁగా వెలసె నధిప. 83
క. అంతయుఁ గనుఁగొని యిఁక నీ
జంత న్నమ్ముదురె యెపుడు చంపునొ యనుచుం
జింతించి యళుకుఁ బాయక
యంతం ద్వర వెడలి కాశి కరిగితి నధిపా. 84
శా. గంగాభంగముల మునింగి నిగమగ్రామేశ్వరు న్విశ్వనా
థుం గీర్తించుచు మ్రొక్కి డుంఠిగజవక్త్రుం గొల్చి యంతంద్రివే
ణిం గాయంబుఁ దొలంచి పూర్వకృతనిర్నిద్రాఘము ల్వాసి నీ
రంగత్పూర్వకృపారసంబునకుఁ బాత్రం బైతి ధాత్రీశ్వరా! 85
క. ఆయద్భుతంబు మదిలోఁ
బాయ మనఁగ లేకయుంటిఁ బదపడి సభలో
నీయాశ్చర్యముఁ గని భూ
నాయక తద్విగుణ మగుట నవ్వుదయించెన్. 86