పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 371


గ్రకథావిధ మడుగ న్మం
త్రికుమారి మనంబు గొలుపఁ దెలుపందొఁడగెన్.

568


తే.

దేవ యభిమానధనుని తృతీయభార్య
యైనమణిమంజరీహంసయాన తనదు
ప్రాయమెల్లను గోర్కులపాలు చేసి
యుపపతిక్రీడ కేకారుచున్న యంత.

569


క.

ధరపై నిగమావతియను
పురమునఁ గ్రూరుఁడను నామమున నొకశూద్రుం
డరివరనికరభయంకర
కరకరవాలాంకుఁడై జగన్నుతిఁ గాంచున్.

570


క.

ఆతనికిఁ జపల యనఁగాఁ
గాతరమృగనయన యొకతె గల దది మదిలో
నీతి గణింపక జార
వ్రాతములకు హృదయ మిచ్చి వర్తిల్లుటయున్.

571


తే.

ఆతఁ డది యెఱింగి కామినీహత్య కళికి
యాలిఁ దోడ్కొని పరభూమి కరుగుబుద్ధి
గంధవతిచెంత కరుదేరఁ గతిపయప్ర
యాణముల నంత నచ్చపలాబ్జనయన.

572


ఉ.

వీఁ డిఁక నెన్నిదేశములవెంబడిఁ ద్రిప్పునొ యేమి చేయను
న్నాఁడొకొ కా దటంచు జతనంబునఁ గన్ను మొఱంగిపోయిన
న్వాఁడిమి వెంటనే వెదకవచ్చుఁగదా యెటులైన నీతనిం
బోఁడిమి మాన్చికాని మఱిపోదఁగదంచు విచారఖిన్నయై.

573