పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 361


యసమానమనీషాఢ్యులు
వసియింతురె యాఁడుప్రతిమ వ్రాసినయింటన్.

513


క.

కావున వివాహవిచ్యుతి
గావించితి ననుచుఁ బలుకఁగా వార లయో
దేవా సర్వజ్ఞుఁడ విటు
లీవాక్యము లాడవచ్చునే యివ్వేళన్.

519


తే.

ఎంచిచూచిన నూటవెయ్యింట నొకతె
గాక సతు లెల్ల జారసంగమసుఖైక
పరతఁ జెందిన వాన లేకరణిఁ గురియుఁ
బంట లేచందమునఁ బండుఁ బార్థివేంద్ర.

520


క.

ఇలువరుసయు మానుషముం
గలరాజుల యిండ్ల గన్నెకలు పుట్టునెడం
దెలిసిన వరించి మఱివా
రల నగరికిఁ దెచ్చి పెనుపరాదా చాలన్.

521


వ.

అని నిర్బంధించిన నయ్యభిమానధనుం డియ్యకొని సమన్వయమాన్యు లగు రాజన్యుల కన్యాజనంబులం బ్రతీక్షించుచుం బుట్టినయప్పుడ సూతికాగృహంబులు సొచ్చి బాలికాచతుష్టయంబుం బరిగ్రహించి నిజగేహంబునకుం దెచ్చి వియచ్చరపథావరోధిసాలనికరం బగునంతఃపురంబున వేఱువేఱ గృహంబుల నునిచి క్రమక్రమంబున మదసేనయు మంజువాణియు మణిమంజరియు మకరందయు ననునామంబు లిడి పోషింప నొక్కదాదిం గట్టడి సేసి కొండొకకాలంబునకు జవ్వనంబు నివ్వటిల్లిన నవ్వెలందులకు వరుసక్రమంబున