పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342 శుకసప్తతి

యుండిగల్నిండఁ బొన్నూళ్ల కేగెడు బేరు
లకలంకభక్తి గానుకలు వైవఁ
గుప్పగాఁ దెరువాట్లు గొట్టెడు పెనుదొంగ
బంటు లాదాయంబు పంచి యొసఁగ
తే. నీడపందిరి చెంత గన్నేరుతోఁట
నమ్మి పూజించుఁ గ్రొత్తకాణాచినంబి
పొంతనిన్చిన దారువిభూతిపాత్ర
మమరఁ గనుపట్టె నచట విఘ్నాధినేత. 438

సీ. తను దలంచినవేళ ధరణీధరకుమారి
పాలిండ్ల బోరునఁ బాలు గురియఁ
బొడఁగనవచ్చు వేల్పులఱేని కరిఁ జూచి
దాక్షాయణీభర్త తన్నుఁ దలఁప
మనసునిల్వమి నెమ్మి మాపుపై వయ్యాళి
మన్నీఁడు తనుఁజూచి మరలిపోవ
మముఁ బిల్వఁ బంపుకొమ్మా యని ప్రమథసం
ఘమ్ములు తనపేరఁ గమ్మలనుప
తే. నతుల కైలాసలీలాగృహాంతరాళ
కేళికాపాళికలును గపోల మరిచ
కాయమానమహచ్ఛాయజాయమాన
మేదురామోదుఁ డయ్యె లంబోదరుండు. 439

క. ఆతనికి వెఱచి పథిక
వ్రాతము తనుఁ జెనకకునికి వటభూరుహ మ
త్యాతతశాఖాగ్రవస
ద్యోతటినీహంసికాసముత్కర మయ్యెన్. 440