పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322 శుకసప్తతి

నిది యెఱింగి కాదె ఋషులు వసిష్ఠాదు
లును సభార్యు లగుచు వినుతిఁ గనిరి. 340

క. ఒడలంటం గాళ్లు పిసుకం
గడివెఁడు వేన్నీళ్ల నీయఁ గంచము వెట్టన్
బడక యమప్పఁగఁ జేతికి
విడెమియఁగ భార్య కాక వేఱొక తగునే. 341

తే. తిథులయందైన మఱి యపత్నీకుఁ డనుచు
బ్రాహ్మణార్థంబుఁ జెప్ప రేపాటివారు
నొకతె రూపసి గాకున్న నోసియన్న
నోయనెడు మాత్రమునకైన నుండవలయు. 342

క. కావునఁ బునర్వివాహము
గావలయు నటంచుఁ దెలుపఁగా నాతఁడు మే
ధావిని యను భూసురసుతఁ
బావనతరవంశజాతఁ బరిణయమయ్యెన్. 343

క. ఇలునించికొనుట మొదలుగఁ
జలమున మెం డొడ్డి మిగులఁ జండించుచుఁ ద
త్కలకంఠి గురుజనంబుల
కులధర్మం బెంచ కేలుకొంచుం దిరుగున్. 344

సీ. తండులమాషముద్గముల గాదెల నించి
మీఁద బిళ్ల లమర్చి మెత్తు వెట్టు
బక్వశాకం బెల్లఁ బతికంచమున నుంచి
యొడికంబుగాఁ బట్టి యూర్చివైచు
నాజ్యతైలఘటంబు లన్నియు వాసెన
ల్గట్టి యందనిచోట సుట్టె నుంచు