పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320 శుకసప్తతి

బునఁ బల్కె వైశ్యభామిని
విని వేగుట గాంచి మదనవేదనమతితోన్. 332

తే. అంతిపురమున కేగి యయ్యబ్జనయన
నాఁటిరాతిరి భూనాథు నరయఁ దలఁచి
దూతికాయుక్త యగుచు నే తెంచినట్టి
సెట్టిసానిఁ గనుంగొని చిలుక వలికె. 333

తే. సకలశుభమస్తుతే వైశ్యసారసాక్షి
యక్కడికి దెల్పి నిల్పితినమ్మ కథయు
మది దలఁపువచ్చె నటుల నమ్మంత్రితనయ
వేగమఱునాఁడె భూమాశు వెఱ్ఱిబుద్ధి
మాన్ప మదిలోఁ దలంచి సంభ్రమముతోడ. 334

వ. నవరత్నఖచితచతురంతయానాధిరూఢయై యవ్వరారోహహజారంబుఁ జేరం జని యవనికాభ్యంతరంబునఁ గూర్చుండి మీనహాసకారణాధీనాజ్ఞానపరుండై యున్నయన్నరేంద్రచంద్రుం గని దత్కథాప్రసంగంబు వినుమని యిట్లను నట్లు మహాప్రవాహముఖంబునం బడి తెప్పిరిల శక్తి చాలక మండూకధృతమస్తకంబై పోవు నమ్మహాభుజంగంబుతో నాఖంజనం బిట్లనియె. 335

క. ఆకథ వినుమని తద్గా
థాకథనకుతూహలంబు దఱుమఁగ వెంటన్
నాకపథంబునఁ బోవుచు
నాకుండలివిభునితోడ నతఁ డిట్లనియెన్. 336