పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 314

క. అంత మఱునాఁడు ధరణీ
కాంతుఁడు పిలిపింప నజ్జగన్మోహిని య
త్యంతవిభాసితమణి ఖచి
తాంతరపల్యంకికాసమారోహణయై. 314

సీ. నేల జీరక యుండఁ గేలఁ గుచ్చెలఁ బూను
కొని యూడిగపుఁ జెలు ల్గునిసి నడువ
మడిమెత్తు పరువుతో మంత్రాక్షతము లీయఁ
బాల్పడి భూసురభామ లెదుర
నొక్కకే లొఱగుపై నుంచి యేకాంతంబు
దెలుపుచుఁ గూరి నెచ్చెలులు సనఁగ
నెదురుగాఁ బఱతెంచి నృపమౌళి సమయంబు
హెగ్గడికత్తియ లెచ్చరింప
తే. కోరి పురివారిజాక్షులు గుంపుగూడి
యమ్మ యిదిగాక యైశ్వర్య మౌర యనుచుఁ
బలుకఁ గోయిలపరిభాష లలతి నగవు
మీఱ నన్నారి యరిగె హజారమునకు. 315

క. అరిగిన ప్రతిసీరాం
తరమునఁ గూర్పుండి యద్భుతముగాఁ బాథ
శ్చరహాస మని ప్రసంగాం
కుర మెత్తిన విక్రమార్కకువలయపతితోన్. 316

తే. అవ్వరారోహ పలుకు నన్నడుగ వలవ
దన్న నడిగెద విట్లేని యధిప మున్ను
పలుకవల దన్నఁ బలికి యాపైవిచార
మందు నలదందశూళ మట్లగుదు వీవు. 317