పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 283

మ. అను నిల్లాలిని గౌఁగిటం బొదివి నెయ్యం బార నూరార్చి య
వ్వనితం దోడ్కొని వచ్చి యందఱి నెగు ల్వారించితంచుం బ్రియం
బున నాచారణు వీడుకొల్పి తనగీముం జేరె నాతండు కా
మినియుం దానును నిట్టి నేర్పువలెఁ జుమా నీకుఁ గోకస్తనీ. 153

తే. అనుచుఁ గీరంబు వల్కె వైశ్యాంబుజాత
గంధి నివ్వెఱపడి యదిగాక జంత
యని ప్రమోదించి యరుణోదయంబుఁ గాంచి
యరిగే శశికాంత బద్ధశుద్ధాంతమునకు. 154

క. ఆమాపు వలపుత్రోపున
భామాపుష్పాస్త్రు భూమిపతిఁ జేరుటకా
రామ యరుదేర శుకము సు
ధామయమధురోక్తి నద్భుతంబుగఁ బలికెన్. 155

పందొమ్మిదవకథ


క. కనకాంబరి కనకాంబరి
యనఁగా నొకపురము గలదు హర్మ్యాగ్రవినూ
తనహరిమణిఘృణితిమిరో
జ్జనితరహఃకేళిసౌధజాలం బగుచున్. 156

తే. ఆపురం బేలు నీలవాహనుఁ డనంగ
రిపుతమోహేళి యగు నొక్కనృపతిమౌళి
యతని చెంగట ధీరుఁ డనంగ బిరుదు
నిండు మాస్టీఁడు నెగఁడు మన్నీలు వొగడ. 157