పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280 శుకసప్తతి

నిను నఱచేత నుంచుకొని నేఁ బదిమాళ్లకుఁ గొన్నతొత్తు మ
ద్వనిత కలంచెనేని పెడవాడనె వైవనె యింత యేటికిన్. 137

తే. అనిన నంగీకరించి యయ్యంబుజాక్షి
యపుడె పైనంబు సంజోక లమరఁ జేసి
చారణుని వెంట నింటి విచార ముడిగి
చనియెఁ దొలికోడికూఁత ప్రొద్దుననె లేచి. 138

వ. ఇవ్విధంబున నవ్వధూమణి యుపనాథాదీనయై యరుగునెడఁ దృతీయదినప్రయాణంబున. 139

సీ. పరికరోత్తరయుక్తపాథేయమును సజం
బీరమై యొకనాఁటి బియ్యమున్న
యసిమిలోఁ జలువ మాయక యుండ మడఁతవె
ట్టిన చల్లడము దుప్పటీరుమాలు
నొరపుగాఁ బొలుపొందు నురగవల్లి దళంబు
పూగపూరితమైన పొరలతిత్తి
వ్రేలఁ బ్రతిక్షణార్ద్రీకృతశంఖచూ
ర్ణంబైన లోహకరండకంబుఁ
తే. గాళ్ల బిడివాళ్లు నికటమార్గప్రపాన్న
రసనము న్మేషజనితమౌ రాగ మమర
నృపతిచే నంపకము గాంచి యిల్లు సేర
వచ్చె నాదారిఁ దన్మనోవల్లభుండు. 140

క. అపు డారజకాంగన యే
నెపమున బొంకంగవలయు నీమదిలోన
న్నుపమగని చూచి తెలియఁగ
జెపుమా చూచెదము నీదు శేముషిబలమున్. 141