పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276 శుకసప్తతి

తే. అట్టు లరుదెంచి తక్కువ యనుటగాని
దోసమాడుదురా యని యాసవంబు
మంచి దని యల్లవృద్ధ వర్ణించి లేఖ
లొసఁగి క్రోలిరి మైరేయ మోపినట్లు. 118

చ. కనుఁగవదోరగల్లుల వికారపుఁజూపుల కోపు లాసుతో
డనె దళమెక్కు నాలుక తడంబడుమాటల పచ్చితేఱ మో
మునఁ బనిలేనినవ్వుల సముజ్జ్వలచంద్రిక లామతింప న
వ్వనరుహలోచన ల్సివము వచ్చినయందముఁ జూపి రందఱున్. 119

తే. ఒకతె వృద్ధకు మధుమూల్య మొసఁగు టరయ
లేక కొమ్మని మఱియొక్కరూక యొసఁగె
నొకతె గ్రోలియు మైరేయ మొల్ల లెక్క
మరల నిమ్మని దాని వేమరునుగనలె. 120

సీ. కసినికోఁతలు గోసి గారింతు రని బూతు
తెలియఁగా వదినెలఁ దిట్టువారు
బురిఁ బాసి వేఱు కాఁపురము సేయుద మన్న
వినఁ డని పతి దూఱి వనరువారుఁ
గడుపార మగనికే గంజిపోయ దటంచు
నత్త దుర్గుణ మెంచి యలరువారుఁ
దా నెవ్వతెయొ నన్నుఁ దఱిమి యీడ్వ నటంచుఁ
దోడికోడలిఁ జెడనాడువారుఁ
తే. గేరి యొకకొంద ఱాత్మల మీఱినట్టి
మాట లెల్లను మధుమదోన్మాదగరిమ