ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము 271
తే. గోపురముమీఁద ధూర్తచకోరకీర
మెక్కి ప్రజలార మీకేల తిక్కపట్టె
వీరిబగిసికి మఱి గారవించి హరుఁడు
కాయసిద్ధి యొసుగునే కల్లగాక. 94
క. అని వారు తన్నుఁ దునుమం
బనుచుటయును వారికొంప చెఱచుటకై దే
వుని వెనుకనుండి తా నా
డినమాటకు వార లచ్చటికి వచ్చుటయున్. 95
క వినిపించిన నింతేనా
యని యందఱు నవ్వ లజ్జ నానతముఖులై
చని రవ్వేశ్యలు తచ్ఛుక
మునకుం గలనేర్పు నీకుఁ బొసఁగ న్వలయున్. 96
క. అనినఁ బ్రభావతి మది మిం
చిన వెఱఁగున నిన్నువంటి చిలుకలనేర్పు
ల్గననగునె యనుచు వేగుట
గనుఁగొని వెసం జనియెఁ గేళికాగృహమునకున్. 97
క. ఆనాఁటిరేయి బాళి
న్భూనాయకమౌళిఁ జేరఁబోయెడుతఱి న
మ్మీనాయతాక్షి జూచి ప్ర
సూనాంబకతురగ మతులసూక్తిస్ఫురణన్. 98
క. వేసారక మద్వచనసు
ధాసారము మెచ్చ నీకె తగుఁగావున నీ
వీసారి యొక్కకథ విను
మాసారిజయస్తనద్వయా యని పలికెన్. 99