పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 269

క. అనిన విని కామసేనా
వనజానన విన్నయట్టి వచనము లెల్లన్
వినిపించిన నేమేమీ
యని యమ్ముదిజంత చింత యాకులపఱపన్. 84

క. బ్రదు కెల్లఁ జక్కనగునని
మది నమ్మితిఁ గూఁతురా ప్రమాదము రాదే
తుది నిల్లు చూఱవిడిచిన
నిదియేమో మీఁది కార్య మెవ్వఁ డెఱుంగున్. 85

తే. ఆశపడి బోడనైన నేనగుదుఁగాని
యింటిసొ మ్మొక్కకాసైన నీయ నొకని
కొల్ల నే జవ్వనంబు మొఱ్ఱో యి దెట్లు
తగదు నీమాట నే వినుదానఁ గాను. 86

క. అనఁ గామసేన యంతటి
పని రారాదమ్మ కుముదబాంధవధరుఁ డా
డినమాటకుఁ దప్పటవే
యని సమ్మతిపఱిచి నిర్భరాహ్లాదమునన్. 87

క. త్యాగధ్వజ మెత్తించి స
మాగతయాచకుల కీశ్వరార్పణ మనుచున్
బోగముచెలి ధనమెల్లం
బ్రోగులుగా నొసఁగె సకలము న్వినుతింపన్. 88

సీ. పట్టెనామంబుఁ గీడ్పఱిచి నూతనవిభూ
తిని ద్రిపుండ్రంబులు దీర్పవచ్చు
ద్వయము పోఁబెట్టి శైవపురాణపద్యపా
ఠికల వేమాఱుఁ బఠింపవచ్చు