పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 247

వ. అనిన విని యాభామాలలామంబునకుఁ గీరసార్వభౌముం డిట్లనియె. 575

క. ఆదారి నత్త కినిసెనొ
లేదో యాలోన నుమ్మలించుచు నేనిం
కేదియుఁ జెప్పిన నిక్కము
గాదే కద యనుచు గోపకామిని యేడ్చెన్. 576

క. ఆమాటలు విని యత్త ద
యామేదురహృదయయై ప్రియంబున నడుగం
గోమలి యిట్లను గోకిల
కోమలకాకలిని గేలిగొనియెడి పగిదిన్. 577

తే. ఓపలేనన్న వినక కెం పొదవు చూడ్కి
నంపఁగా నేను మీకు మాఱాడ వెఱచి
సంత కేగితిఁ గద యందు సరఁగఁ జెఱఁగు
ముడి విడువ రూక వెస జాఱి పడియెనమ్మ. 578

క. వెదకితి నచ్చోఁ గానక
కద యంతటఁ బ్రొద్దువోవఁగా భయమున నె
మ్మది నింటికిఁ జని తూర్పె
త్తెద నని యచ్చోటి యిసుము దెచ్చితి గంపన్. 579

చ. వెలుపల వడ్డి కిచ్చినను వీసము వచ్చును నట్టు లాయెనో
బలబ వేగ వచ్చు నలబాపని కిచ్చినయట్టు లాయెనో
యలయక నాల్గుచట్ల పెరుఁ గమ్మినఁ జేతికి రానిరూక నా
వలె నలసంతలోనఁ బడవైచిన వారలఁ గాన నెచ్చటన్. 580