పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 245

బెనుపసుపే విత్తు కొననైతిగాయంచు
గాఁపు నిద్దురలేక కళవళింప
తే. మొనసి వెలచూపిచూపకమునుపె వారి
సరకు లమ్ముడువోయె నేజాతివారి
కేని బాటింపవలసి పేరెక్కినట్టి
యాదినంబున నంబురుహాయతాక్షి. 564

తే. అపుడు పొంగటికైన బియ్యంబుఁ దెమ్ము
శీఘ్రముననంచు నొకరూక చేతికిచ్చి
యత్త పొమ్మన నమ్మనోహరతరాంగి
సాంద్రమైనట్టి చెంగటి సంత కరిగె. 565

క. తండులములు గొని పుట్టిక
నిండం బెట్టుకొని రాఁడె నేఁ డైనను జా
రుం డని మదిఁ దలఁచుచు న
మ్మిండం డేతేఱఁ దత్సమీహిత మొదవన్. 566

క. కనుచూపుమేర దానం
గనుఁగొని యమ్మగువ యగునొ కాదో యనుచుం
జను దెంచి గుణార్ణవుఁ డే
గినకార్యము చక్కనగుటఁ గెరలిన తమితోన్. 567

క. అంత మనోహరుఁ గనుఁగొని
సంతసమున మనసు నిలుపఁజాలక యపుడే
కంతురణకేళికై యువ
కాంతునితో నచట వల్లికాగృహసీమన్. 568

తే. చేరి పుట్టిక వెలుపలిచెట్టునీడ
డించి పొదలోని కరిగి యమ్మించుఁబోఁడి