పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 233

క. అని పలుక న్వరుఁ డూరా
ర్చినమాటలు వారితిన్నెఁజేరిన పథికుం
డనుపమధూర్తుం డొక్కఁడు
విని చూతము గాక దీనివిధ మని యంతన్. 514

తే. వేగ మఱునాఁడె యంగటివీధి కేగి
పచ్చడము చీకయును బండ్లుఁ బసుపుఁగొనుచు
వచ్చి వారింటి కేగి బావా యటంచు
వీరునకు మ్రొక్కి యతని నివ్వెరగుఁ గాంచి. 515

క. తివిరి జనానందక గా
రవమున నీయనుజఁ జూచి రారా పోరా
ధవళాయన వచ్చితి నన
నవహితుఁడై వీరుఁ డద్భతానందమునన్. 516

క. ధవళుఁడ వీవేనా యని
కవుగిటఁ గదియించి నెనరుగలబంధుఁడవౌ
దువు నేఁటికైన వచ్చితి
వవసర మిపుడైనఁ గలిగెనా యని పలుకన్. 517

తే. వారిమాటలు విని మదవతి మదీయ
వచన మేజాణయో విని వచ్చి యిట్లు
సందుకొన్నాఁడు కార్యంబు చక్కనయ్యెఁ
గాంక్ష యొనఁగూర్ప ధగళుఁడే కలఁడటంచు. 518

తే. వచ్చి కల్పితసంభ్రమావార్య యగుచు
మ్రొక్క దీవించునాతనిమోముఁ జూచి
యస్న యాశీర్వదించినయంతఫలము
నీవు వచ్చినకతమున నేఁడు గలిగె. 519