పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 221

హాలికబాలిక శశిరే
ఖాలిక యచ్చటికి నీటికై యరుదెంచెన్. 461

క. వచ్చిన మేనికిఁ బ్రాణము
వచ్చిన యట్లైన మెచ్చి వసుథావిబుధుం
డచ్చపలాక్షీమణికి
ముచ్చటతోఁ జేతులెత్తి మ్రొక్కినయంతన్. 462

తే. అయ్యవా రెవ్వరికి మ్రొక్కెనంచుఁ బలుక
నెవ్వతెకు నేల మ్రొక్కునో యెమ్మెలాఁడి
నమ్మి యేదేవరకు మ్రొక్కినాఁడొ యనుచు
నవ్వుచేడెలఁ గూడి యన్నాతి చనియె. 463

క. వాలాయము దినదినమును
బాలామణి వచ్చుననుచుఁ బాఱుఁడు ప్రాతః
కాలమునఁ దత్తటాకము
కూలంబున ముక్కు పట్టుకొని కూర్చుండున్. 464

తే. ఉండి నీటికి వచ్చు నయ్యువిదఁ జూచి
సన్నగా మ్రొక్కు మ్రొక్కఁ దజ్జలజనయన
తనకు మ్రొక్కుటఁ దానాత్మఁ దలఁచితలఁచి
యేటి యాలోచన యటంచు నింటికరుగు. 465

క. అంతట విను మొకనాఁ డ
క్కాంతామణి యతని మనసుఁ గనవలె ననుచుం
జింతించి జోడుప్రాయపు
టింతుల నెడఁబాసి నీటి కేతెంచుటయున్. 466

తే. అతఁడు గనుఁగొని యిది సమయం బటంచు
మఱియు మఱియును మ్రొక్క నమ్మందగమన