పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 203

కేనాఁటివారికైనం
గానీ గేహమున బావి గలుగ న్వలదే. 384

క. అన విని బలదేవుం డో
వనితా యానలకు నేమివచ్చెంబో వే
కొనితేవే జలములు గ్ర
క్కున నీచలిచేత నిలువఁగూడ దటన్నన్. 385

క. ఓనాథ సతులగుణముల
నేనాఁటికిఁ బురుషు లెఱుఁగ రే నెచ్చటికిం
బోనేల నీకుఁ గోపము
రానేల యటంచు నదిపరాకై యున్నన్. 386

క. బలదేవుఁ డబల నాపై
జలమా నానేరమెల్ల సైరించి జల
ములు దెమ్ము వేగఁ బొమ్మని
పలుమఱు వేడుకొనఁ గపటభయ మెనయంగన్. 387

ఉ. మంచిది నీవు పంప ననుమాన మిదేటి కటంచుఁ బల్కి య
క్కాంచనగాత్రి రజ్జుఘటకమ్రకరాంబుజయుగ్మయై కటా
క్షాంచలచంచలాలత యొయారపుఁగొప్పు మెఱుంగునుబ్బుల
న్మించఁగ నేగె ముద్దునడ నీటునఁ గూపసమీపభూమికిన్. 388

మ. చని యాచేరువఁ జారుభూరుహలతాసంతానతంతన్యమా
ననవీనాఖిలసూనసౌరభనిశాంతంబైన పూఁదోఁటలోఁ
దనమేకోలున వచ్చియున్న యుపనాథప్రౌఢు నాఢౌకమా
ననిరూఢద్రఢిమానురాగ మిగురొందంగూడి క్రీడింపఁగన్. 389

తే. అలరె వేగుఁజుక్క యది చూచి భయమందఁ
దనరెఁ బక్షిరుతము దాని వినుచు