పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198 శుకసప్తతి

నమర దొరకొల్వు చేసి గేహమున కేగు
మత్తరిపు శైలదంభోళి మల్లమౌళి. 358

క. ఘనశ్రీ బొందియు నాతఁడు
దినదినమును గొంతకొంత దిరుగుచురాఁగాఁ
దనవారు శత్రులై రట
గనుగొనఁగా వానిలక్ష్మి కడచనిపోవన్. 359

సీ. ధనవారములు చోరతతులపా లయ్యెను
సొమ్ములు కుదువను సొగిసి చనియె
గాదెలధాన్య మెల్కలకయ్యె గుత్తకై
యెనసిన గ్రామంబు లెల్లనెండె
నప్పులిచ్చినచోట నటమటించిరి డాఁచి
కొనినపత్రంబులు చినిఁగిపోయె
వాడకంబులు గొన్నవార లేగిరి తోఁట
లెల్లను బరులచేఁ గొల్లవోయెఁ
తే. గప్పడంబెల్ల గాలిచేఁ గదిలి యురియు
నింట దొర్లెడు కుండలు నినుపకట్ల
మానిముంతలు నిలిచె నమ్మల్లపతికి
వార్ధికన్యాకటాక్ష మవ్వలికిఁ జనిన. 360

వ. ఇవ్విధంబున నక్షుద్రదరిద్రత్వంబు వహించియు నతండు కుటుంబభరణాదరుండై. 361

ఉ. మాసిక వైచికుట్టినరుమాలును జాలనిదట్టిబట్టయు
న్మాసినయెడ్డెదుప్పటి దనర్పఁగఁ గోమటివారిఁ జేరి శం
కాసమవాప్తి నొల్లమనఁగాఁ దనుమర్దనమాచరించుచుం
గాసును గీసు దూసికొనుగాని విడం డతఁ డేమి చెప్పుదున్. 362