పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194 శుకసప్తతి

న్మనసిజుఁ డేయుశరంబుల
యనువున నవ్వేళఁ జినుకు లడరె న్నదులన్. 341

సీ. గొంగడిముసుఁగుతో గొల్లలు చట్రాతి
పైని బందారాకుఁ బఱచికొనఁగ
నాలమందలు మేఁత కరిగి యేతెంచి యం
భారవంబులతోడ మందగొనఁగఁ
బొదుగుదూటుల మాని యొదిఁగి క్రేపులగుంపు
జననీనికాయంబు చాఁటుఁ జేర
నొకటి నొక్కటి చూచి యుఱికి మేఁకలు చెట్టు
నీడలఁ గుమిగూడి నెమరువెట్టఁ
తే. దనరు నంబుదకాండవేదండయూథ
గర్జితోర్జితభూరిభూత్కారగళిత
వమధుశీకరవారదుర్వార మగుచుఁ
జలువతెమ్మెఱ లేతేర సన్నతూర. 342

తే. అప్పు డాకాపువలిగుబ్బలాండ్రు పథికు
లుసుఱుమన ముసురుకొన్న యమ్ముసురులోన
రాఁడు పతి యంచు నిర్భరరతులఁ దేల
మందిరమునకుఁ దెచ్చిరి మాఱుమగల. 343

తే. తెచ్చుకొని యిచ్చలోపల హెచ్చుకోర్కు
లెన్నిగల వన్నియును దీఱ నెనసి చతుర
రతుల కఱవునఁ బడినట్టు లతులసౌఖ్య
వారినిధి దేలుచుండిరి వారలంత. 344

క. పరహితుఁడు మిన్ను గనుఁగొని
దురుసౌ నిఁకమీఁద వానతూర ల్నిజసుం