పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 183

డని యితని బేలుపఱిచెం
జనదు గదా పిఱికిదొరల సరసం గొలువన్. 280

క. పతికి భయమడరుచో నది
యతిశయముగఁ జేసి మాన్యుఁడై బ్రదుకుం గు
త్సితమంత్రి యతనిఁ గైకొను
నతిదుర్మతి యైన నాథుఁ డాప్తుఁడు గాఁగన్. 281

వ. కావున నేకాచారంబగు నమాత్యపథంబునం బ్రవరిల్ల నాకు నకారణభయభ్రాంతుండైన యతని కనుగుణంబుగా నడుచుట కర్తవ్యంబుగాదు బహుకాలం బేతదర్థంబునఁ బోషితుండనై యుండి యివ్వెరవుఁ దెలుపకుండిన సామాన్యులలో గణ్యుండనగుదు నితండు మదీయవచనంబులు వినియెనేని
మే లట్టు గాక దుర్బుద్ధియై మదీయస్థానహానిపర్యంతంబుఁ దలంచినఁ దలంపనిమ్మని నిశ్చయించి యాసృగాలంబు శార్దూలంబున కిట్లనియె. 282

తే. ఎలుఁగులకు వేరువిత్తు దుప్పులకు గండ
మేదులకు మిత్తి లేళ్లకు నెదురుచుక్క
కాసరంబులపాలిటి కంటినొప్పి
యసదు గాదుగదా భవదన్వయంబు. 283

చ. అలవి యెఱుంగ కొక్కపులి కల్గినవాఁడయి భీతిఁ జెందయ
క్కొలపగఁదీర్చుకోఁదలఁచి కోడెవయాళివజీరుఁ డెప్పుడున్
మెలఁగెఁడు వ్యాఘ్రచర్మమను మీనెఱడాగు ధరించి శూరతా
కలన భవత్కులంబునకుఁ గల్గదు జోడు మృగాన్వయంబునన్. 284

క. భిన్నేతరమగు సకలస
మున్నతవిభవాభిజాత్య మున్నదె కద ని