పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 181

మొక్కలంబునఁ జేరి సొక్కుచుఁ దిరుగాడు
మనుబోతుఁ బట్టంగ మఱచెనేమొ
తే. యనుచుఁ దనలోన నూహించి యాత్మఁ జెదరి
చూచి ధైర్యంబు వదలక చోద్య మంది
చెంతఁ జేరఁగ భయమంది చాలఁ గలఁగి
తఱుచు భ్రమవొంది యంతటఁ దానె తెలిసి. 270

ఉ. నాలుక వ్రేలవైచి వదనంబు వివర్ణవిధంబుఁ జెందఁగా
మ్రోలఁ జెలంగియాడెడు రురుప్రముఖంబులమీఁద నేమియున్
వ్రాలనిచూడ్కి గుండెయదర న్నిలుపోపక యున్న యట్టిశా
ర్దూలకులేంద్రుఁ జూడ భయదోషముఁ జెందినరీతి గన్పడన్. 271

క. నాయంతమంత్రి యుండి య
పాయం బగునట్టి వేళ నధినాథుసుఖ
శ్రీయుతుఁ జేయక యుండుట
నాయమె యిదిపోదు పతిమనంబలరింతున్. 272

క. అని తలఁచి సుమతి చేరం
జని పులికిం గేలు మొగిచి సవినయముగ న
వ్వనినుండి యుబుసుపోకం
జనుదెంచితి రేమొ యిచటిజాడలు చూడన్. 273

క. దొరయైనయతఁడు మఱచియుఁ
బరభూమికిఁ బోవరాదు పనిగట్టినచో
నురుతరనిజభటయుతుఁడై
యరుగందగు లేకయున్న నాపద లొదవున్. 274