పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 139

వలు మెట్టి మేలిమిం గురు
వలు వమరం గట్టి వింతవగ గనుపట్టన్. 56

తే. రాజు తొలునాఁటిరేయి విరాళిగొనుటఁ
దెలుపుచును వెంటవచ్చుదూతికయుఁ దాను
సరస కేతేర నక్కీరసార్వభౌముఁ
డరిది యపరంజిపనులపంజరము వదలి. 57

క. చనువేళ నిలిచి పొమ్మని
యనరా దపశకున మనుట నైన న్నీపై
నెనరునఁ దెలిపెద నొకకథ
కనకాంగీ వినిన నేర్పుగలుగు న్నీకున్. 58

వ. అని పలికి యాభామినీమేదురావలోకనాధారంబునం దదీయాంగీకారంబు నెఱింగి యప్పతంగపుంగవుండు హాసంబుతో నితిహాసం బిట్లని చెప్పం దొడంగె. 59

ఏడవకథ

తే. అమరసౌవీరదేశంబునందు విటత
రంగితాభంగమోహాంబురాశి చం,
కార్యకృద్వారభామాప్రకాశమాన
లపనమండల మగువిశాలాపురంబు. 60

క. ఆపురము నరోత్తముఁ డను
భూపాలుం డేలు నతనిప్రోపున వైశ్యుం
డేపారు నొకఁడు ధర్మ
వ్యాపారం బలర విమలుఁ డనునామమునన్. 61