పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 105

కలఁగన్నయట్టు లొకనాఁ
డలవోకం జూచి మన్మథాజ్ఞావశుఁ డై. 445

క. అందనిమ్రానిఫలం బిది
యందుకొనుట యెట్టులొక్కొ యనుచు మనమునన్
దుందుడుకుచే ధరామర
కందర్పుం డతఁడు మేలు గలవాఁ డగుటన్. 446

తే. అంత నత్యంతకాముకుం డగునతండు
ఛాందసుఁడు గానఁ దనమనస్తాప మెల్లఁ
దెల్లమి యొనర్పఁ దగదంచుఁ దెలియనేర
కల్ల నగరింట నొకదాది ననుసరించె. 447

ఉ. ఈనరనాథకన్యపిఱుఁ దించుక ముట్టఁగనిచ్చి మేనునా
మేనున నంటఁ జేర్చి రుచిమించినమోవి యొసంగెనేని భూ
దానహిరణ్యదానఫలదానము లిచ్చినయట్ల విప్రుం డెం
తైనను దానయోగ్యుఁడుగదాయని నన్బ్రతికించునావుడున్. 448

తే. అది దిగుల్పడి యెట్లు నోరాడె నౌర
పలుక నీరీతి నోవెఱ్ఱిబాఁపనయ్య
ముక్కఱయుఁ గమ్ములును దాల్చి మురియుచున్నఁ
జూడఁజాలక యిట్లాడినాఁడవేమొ. 449

క. అన విని తత్పదయుగళం
బునఁబడి నీధర్మసత్రపుం బ్రాహ్మణునిన్
నను మన్నించిన నిఁక నే
నొనరించిన ధర్మ మెల్ల నొసఁగెద నీకున్. 450