పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 79

తే. యిది సదాచారమే రాజసదన మిదియె
యిది కులాంగనయే యంచు మది నొకింత
సందియము దోఁప నారాచచందమామ
యాగ్రహోదగ్రవిగ్రహుం డగుచు ననియె. 315

తే. నీజనని పుణ్యజనవర్ణనీయసాధ్వి
నీజనకుఁ డెన్న నభిమాననియతధనుఁడు
నీనగరు పోతుటీఁగకు నిలువరాని
దయ్యు వెల్లాటకత్తె వీవౌట యరిది. 316

శా. నీజాడ ల్గని యోర్చుకోఁ దగునటే నీలాహివేణీ మహా
రాజస్త్రీజన మీవగ ల్వినిన నౌరా యంచు ని న్మెత్తురే
యేజాతి న్నినువంటి దంట గలదే యిద్ధాత్రిలో నంచు వి
భ్రాజన్మానధురంధరుండు నృపుఁ డుగ్రవ్యగ్రరోషాత్ముఁడై. 317

క. కుఱుచవగ చిక్కటారిం
బరికింపక గొంతుచిదుము పనిఁ దలఁచి నరే
శ్వరచంద్రుఁ డాతలోదరి
కురు లొయ్యన నొడిసి పట్టుకొనియె లతాంగీ. 318

తే. అప్పు డాబారి గడతేఱనగు ప్రయత్న
మెట్లు చింతీంపవలయు రాకేందువదన
యడుగు దప్పినచోఁ దప్పుఁ బిడుగటంచు
నొడువ మును విందువే కద పుడమిలోన. 319

చ. అన విని మందహాసరుచిరాస్య ప్రభావతి వల్కె నీవగ
ల్గని విని యున్నవారి నడుగందగు నోశుకసార్వభౌమ యే