పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అన విని వేనుఁ డిట్లను నాకు మిక్కిలి పూజ్యుఁ డెవ్వఁడు జగంబులఁ దలంప
హరి యన నెవ్వఁ డంబురుహగర్భజనార్దన, శివేంద్రమారుతానలయమార్క
వరుణచంద్రాదిదేవతలెల్ల రాజదేహాశ్రితు లగుట ధరాధినాథుఁ
డఖిలదేవమయుండు సామోదులై నృపుఁ బూజింప శ్రేయోవిభూతి గలదు


గీ.

భర్తృశుశ్రూషణం బెట్లు పరమధర్మ, మంగనల కట్ల మీకు రాజాజ్ఞసేత
ధర్మ మట గాన మీరును దడవరాదు, యాగదానాదికృత్యము లస్మదాజ్ఞ.

342


చ.

అన మును లిట్లు పల్కిరి జనాధిప! యానతి యిమ్ము ధర్తవ
ర్దన మొనరింప నే మొకటి తథ్యము చెప్పెద మాదరమ్మునన్
వినుము జగంబు లెల్లను హవిఃపరిణామమె సుమ్ము యాగవ
ర్తనములు లేకపోయిన ధరావలయం బశుభంబుపా లగున్.

343


క.

అని పలుమాఱును జెప్పిన, విననొల్లక యతఁడు ధర్మవిముఖుం డైనన్
మును లెల్లఁ గోపమున నీ, ఘనపాపుని జంపుఁ డనుచు గాఢప్రతిభన్.

344


చ.

అనిశము యజ్ఞపూరుషు జనార్దను బుణ్యచరిత్రు నింద చే
సిన కుటిలాత్ముఁ జంపుఁడని శీఘ్రమె మంత్రపవిత్రదర్భవ
జ్రనిహతి చేసి రమ్మునులు సారసనేత్రుని నింద మున్న చ
చ్చిన యవివేకిఁ బాపగుణశీలుని దుర్మలినాంతరంగునిన్.

345


వ.

అంత.

346


ఉ.

చోరులు రేగి గేహములు చొచ్చి యవధ్యులసొమ్ములెల్ల ని
ష్కారణవైరులై కొనిరి సందడి గాఁగ నొకళ్లొక ళ్లతి
క్రూరత నర్థలోభమున ఘోరరణంబు లొనర్చి రంత ది
గ్వారము లెల్ల ముంచె ననివారత భూరిరజోంధకారముల్.

347


క.

మునులు నరాజకదోషం, బనుచు విచారించి యజ్జనాధిపుతొడ నే
ర్పొనర మథించిరి పుత్ర, జనన మాత్మలఁ గోరి సజ్జనస్తుతచరితా.

348


గీ.

చూడఁజూడంగఁ గాలినమోడువంటి, మేను మరుగుజ్జురూపు వెంబైననోరు
కలుగువాఁడు జనించె నొక్కరుఁడు వేన, మహిపు మథితోరుతలమున మౌనివర్య.

349


క.

ఏ నేమి చేయుదున్ మీ, రానతి యిం డనుచు నాతఁ డాతురుఁడై య
మ్మౌనులఁ బల్కిన వారు త, దాననమున్ గని “నిషీద" యని పల్కుటయున్.

350


చ.

అతఁడు నిషాదనామధరుఁ డయ్యెఁ దదంగసముద్భవుల్ సము
ద్ధతులు నిషాదు లుగ్రబలదర్బులు పాపరతుల్ జనించి యూ