పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

హరిమహితప్రభావమహిమాతివివర్ధితయోగనిద్ర సుం
దరసుగుణాభిరామ యగు నందవధూమణికుక్షిఁ బుట్టె న
త్తఱి గ్రహతారకాళి విశదస్థితిఁ బొల్చె నపేతభీతియై
పరఁగె జగంబు ధర్మమయపద్ధతివర్తిజనానుభావ్యమై.

421


గీ.

భూమిభారంబు వారింప భూతలమున, నవతరించినఁ బుండరీకాక్షునకును
భూరిశృంగారవతులు పదాఱువేలు, నూఱునొక్కరు భార్య లైనారు సుమ్ము.

422


వ.

అందు రుక్మిణీసత్యభామాజాంబవతీప్రముఖ లెనమండ్రు పట్టమహిషు లైరి.
అనాదినిధనుండైనహరి యక్కాంతలయందు నెనుబదిలక్షల పుత్రులం
గనియె. వారిలోఁ బ్రద్యుమ్న చారుధేష్ణ సాంబాదులు పదుముగ్గురు శ్రే
ష్ఠులు. అందు.

423


గీ.

ఘనుఁడు ప్రద్యుమ్నుఁ డధికవిఖ్యాతి మేన, మామ రుక్మితనూభవ మహితసద్వి
నయ కుముద్వతి యనెడుకన్యాలలామఁ, బ్రేమ దళుకొత్తఁగా వేడ్క బెండ్లియాడ.

424


వ.

వారలకు ననిరుద్ధుండు పుట్టె. ఈయనిరుద్ధుండు రుక్మిపౌత్త్రి సుభద్రం పెండ్లి
యాడె. వారికి వజ్రుండు వజ్రునకుఁ బ్రతిబాహుండు పుట్టె. ప్రతిబాహునకు
సుచారుండు గలిగె. ఇ ట్లనేకపురుషసంఖ్య గల యదుకులంబుపుత్త్రసంఖ్య
వర్షశతంబులకైన లెక్కింప శక్యంబు గాదు. అక్కుమారవర్గంబులకు విద్య
లఁగఱపు గురువులు మూఁడుకోట్ల యెనుబదియెనిమిదిలక్షలు దేవాసుర
యుద్ధంబున హతులైన మహాబలు లగుదైతేయులు మనుజలోకంబునం బుట్టి
జనోపద్రవకారులై యుండ వారల వధించి భూభారంబుఁ బాపుటకై భగవం
తుం డగు హరి యదుకులంబున నవతరించి ముఖ్యంబైన యదుకులశతంబునకుఁ
బ్రభువై యుండె. ఇట్లు యాదవులు వృద్ధిం బొందిరి. ఈయాదవసంపత్తి విన్న
వారు పాపంబులఁ బాయుదురని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

425


క.

యదువంశం బెఱిఁగించితిఁ, బదపడి దుర్వసునివంశపద్ధతి నీకున్
విదితంబుగ నెఱిఁగించెద, హృదయం బేకాగ్రవృత్తి నెసఁగఁగ వినుమా.

426


వ.

తుర్వసునకు వహ్ని, వహ్నికి భార్గుండు, భార్గునకు భానుండు, భానునకుఁ గరం
దముండు, కరందమునకు మరుత్తుండు పుట్టె, అతం డనపత్యుండై పౌరవుండైన
దుష్యంతుని బుత్రునింగాఁ గల్పించుకొనియె. ఇట్లు యయాతిశాపంబున
దుర్వసువంశంబు పౌరవవంశంబు నాశ్రయించె. ద్రుహ్యునికి బభ్రువు నతనికి
సేతువును గల్గిరి. సేతువున కారబ్ధండు, నతనికి గాంధారుండు, నతనికి ధర్ముండు,
నతనికి ఘృతుండు, ఘృతునకు దుర్దముండు, నతనికిఁ బ్రచేతుండు, నత