పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్గమతరవిష్ణుతేజమున రంజిలి యిర్వదియొక్కవేయుధై
ర్యమహితసారసాహసనిరంకుశు లాత్మజు లర్థిఁ గొల్వఁగా.

48


వ.

ఇట్లు యుద్ధంబు చేయునప్పుడు దుందుముఖనిశ్వాసాగ్నిదగ్ధులై యేకవింశతి
సహస్రనందనులు మృతులైనఁ గువలయాశ్వుండు దుందునిం జంపె. తన్నిమి
త్తంబున నతనికి దుందుమారుండను పేరు కలిగె. అతనికి దృఢాశ్వ చంద్రాశ్వ
కపిలాశ్వులన హతశేషులగు ముగ్గురుపుత్రులు గలరు. అందు దృఢాశ్వునకు
హర్యశ్వుండు, నతనికి నికుంభుండు, నతనికి సమతాశ్వుండు, నతనికి గృశా
శ్వుండు, నతనికిఁ బ్రసేనజిత్తు, నతనికి యువనాశ్వుండుఁ బుట్టె..

49


క.

ఆయువనాశ్వుఁ డపుత్రకుఁ, డై యతివిహ్వలత మునుల యాశ్రమములకున్
బోయి యుపాసించినఁ గరు, ణాయతత వారు నతని కభ్యుదయముగన్

50


వ.

మదిం దలంచి పుత్రోత్పాదనంబునకు నిష్టి గావించి యదియు మధ్యరాత్రం
బునకు నివృత్తం బగుచుండ మంత్రపూతజలపూర్ణకలశంబు వేదిమధ్యంబునం
బెట్టి యమహామునులు నిద్రించుటయు నవ్వేళ యబ్భూపాలుం డతితృష్ణాకు
లుండై యాశ్రమంబునకు వచ్చి ని ద్రాళువులైన యాకృపాళువుల మేలుకొలుప
నొల్లక యపరిమేయమాహాత్యమంత్రపూతకలశజలంబులు ద్రావిన నంత
మేల్కొని మును లజ్జలంబు గానక యిట్లనిరి.

51


ఉ.

ఎవ్వరు ద్రావి రీసలిలమేధితవైదికమంత్రభావితం
బివ్వసుధాతలేశసతి కిందుల నిందుల సత్సుతుండు మే
ల్నివ్వటిలంగఁ బుట్టి ధరణీవలయం బఖిలంబు నేలు ని
ట్లొవ్వమి వచ్చె నీపని కయో యనువాక్యము లాలకించుచున్.

52


చ.

జనపతి యేగుదెంచి మునిసత్తములార మదీయమౌఢ్య మి
ట్లనయము తెచ్చె నంచు వినయంబునఁ బల్కెడు నంత గర్భమై
దినదినవృద్ధిఁగాల మరుదెంచిన దక్షిణకుక్షి వ్రచ్చి నం
దనుఁ డుదయించె నయ్యవనినాయకుఁడు న్మృతిఁ బొందె గ్రక్కునన్.

53


వ.

మహామును లబ్బాలకుం డేనామంబు ధరియింపంగలండని పల్క.

54


గీ.

పాకశాసనుఁ డరుదెంచి బాలుఁ జూచి, “ఏషమాంధాస్యతి" యటంచు నెంచుకతన
దారకుఁడు దాల్చె నపుడు మాంధాతృనామ, మఖలలోకైకవిశ్రుతం బగుచునుండ.

55


వ.

అబ్బాలకునివక్త్రంబున నింద్రుం డమృతస్రావిణియైన నిజప్రదేశిని యిడిన
తదీయామృతపానంబుల నల్పదినంబులనే వృద్ధిఁ బొంది చక్రవర్తియై సప్త