పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అణువులు, మసూరంబులును మానవలయు. అలాబువును, గ్రుంజనంబును,
పలాండువును, బిండమూలకంబును, గాంధారకంబును, గరభంబును, లవ
ణంబును, నౌషరంబును, నారక్తనిర్యాసంబులును, బ్రత్యక్షలవణంబును
వర్జితంబులు. వాగ్దూష్యంబు నక్తాహృతంబును, నుచ్ఛిష్టంబును వర్జంబ.
గోవులు ద్రావనివియు, దుర్గంధఫేనిలంబులును నగుజలంబులు గావు.

256


చ.

జనవర యొంటిడెక్కగల జంతువు లిచ్చినపాలు గొఱ్ఱెపా
లును నెనుపెంటి యిచ్చినవి లొట్టియ యిచ్చినపాలు కూడ వెం
దును మృగజాతిపాలు గడుదూష్యము లంచుఁ బితృక్రియావిదుల్
వినుతబహుస్మృతు ల్వెదకి విశ్రుతలీలలఁ జెప్పి రొప్పుగన్.

257


క.

అపవిద్ధుఁడు పాషండుఁడు, శ్వపచుఁడు రోగాతురుండు చండుఁడు నగ్నుం
డపవిత్రసూతకాశౌ, చపరులు కనుఁగొనినఁ గాదు శ్రాద్ధం బధిపా.

258


వ.

(వీరు) చూచినను రజస్వలలు చూచినను కుక్కటవానరగ్రామసూకరం
బులు చూచినను శ్రాద్ధంబునఁ బితలును దేవతలును భుజియింపరు.
కావున నివి దొరలకుండ శ్రద్ధాసమన్వితుండై చేయవలయు. తొల్లి కలాప
పురోపవసంబున మనుపుత్రుండైన యిక్ష్వాకునిముందరం జెప్పిన పితృగీతలైన
గాథలు కొన్ని గలవు. వానియర్ధంబు వినుమని యిట్లనియె.

259


గీ.

మాకులంబున నొకఁడు సన్మార్గశీలుఁ, డుదయమై గయ కేగి యం దొనరఁ బిండ
మిడునొకో యట్టులైన మేమిందఱమును, దృప్తి నొందెద మిప్పుడు ప్రియముతోడ.

260


ఉ.

అనిన వేడ్క మాకులమునందు జనించినవాఁడు శ్రద్ధతో
దేనెయు నేయుఁ బాయసము తెచ్చి మఘర్క్షమునం ద్రయోదశి
న్మానకవార్షికంబులగు మాసముల న్మముఁ గూర్చి పెట్టునొ
క్కో నిరపాయతృప్తి నపు డొందుదు మట్లయిన న్ముదంబునున్.

261


గీ.

గౌరియగు కన్య విప్రపుంగవున కర్థి, దాన మిచ్చిన నల్లనిదాని వృషభ
వరము విడిచిన దక్షిణావంతమైన, తురగమేధంబు చేసిన దొరకుఁ దృప్తి.

262


వ.

ఇవ్విధంబున నౌర్వుండు సగరునకు సదాచారంబు చెప్పె. ఇవ్విధంబున నడి
చినయతం డుత్తముండు. దీని నుల్లంఘించి నడిచినయతండు నిరయంబునం
బడు. అని చెప్పిన పరాశరునకు మైత్రేయుం డిట్లనియె.

263


చ.

మునివర నగ్నుఁ డెవ్వఁడు విమూఢత నేపని చేయ నగ్నుఁడౌ
వినవలతున్ దదీయమగు వృత్తము సత్కరుణాకటాక్షవీ