సుమంతుండును, అగ్నివర్చుండును, మిత్రాయువు, శాంశపాయనుండు, అకృత
ప్రణుండు, సౌవర్ణియు నన నార్వురు సూతునిశిష్యులు పురాణంబులు, సంహి
తలు చదివిరి. కాశ్యపి, శాంశాయన, రోమహర్షణియును సంహితాత్రయంబు
చదివిరి. బ్రాహ్మంబు, పాద్మంబు, వైష్ణవంబు, శైవంబు, భాగవతంబు, నార
దేయంబు, మార్కండేయంబు, ఆగ్నేయంబు, భవిష్యత్పురాణంబు, బ్రహ్మకై
వర్తనంబు, లైంగంబు, వారాహంబు, స్కాందంబు, వామనంబు, కార్మంబు,
మాత్స్యంబు, గారుడంబు, బ్రహ్మాండంబు నను నష్టాదశపురాణంబులు సర్గ,
ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితంబులు తెలుపుచుండు. మైత్రేయా!
ఇప్పుడు నీకుఁ జెప్పు నిప్పురాణంబు వైష్ణవంబను మూఁడవపురాణంబు. ఇందు
సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితంబులయందును, సమస్త
వస్తువులయందును, భగవంతుండైన విష్ణుండు ప్రతిపాదింపఁబడు. షడంగం
బులు, నాల్గువేదంబులు, మీమాంసయు, న్యాయవిస్తరంబును, పురాణం
బును, ధర్మశాస్త్రంబును నన చతుర్దశవిద్యలు ఆయుర్వేదంబును, ధనుర్వేదం
బును, గాంధర్వంబును, నర్థశాస్త్రంబును గూడ నష్టాదశవిద్యలు చెప్పితి. బ్రహ్మ
ర్షులు, దేవర్షులు, రాజర్షులు నన ఋషిప్రభృతులు మూఁడుతెఱంగులు. ఇవ్వి
ధంబున శాఖలు, శాఖాభేదంబులు, శాఖాకర్తలు, తద్ధేతువులుం జెప్పితి.
సర్వమన్వంతరంబులయందును శాఖాభేదంబులు సమంబ ప్రాజాపత్యశ్రుతి
నిత్యంబ. ఇతరంబులు వికల్పంబులు. ఇంక నేమి యడిగెద వనిన మైత్రేయుం
డిట్లనియె.