పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్ను నయమునఁ గొంతకాలము, చనఁగ యమునిసవతితల్లి శపియించుటయున్.

22


ఇవ్విధంబున.

23


గీ.

ఛాయ జముని శపింప నాచంద మరసి, సంజ్ఞ కాదని మది నెన్ని చండకరుఁడు
పోయి కనుగొనె నపుడు తపోవనమునఁ, గొదమగోడగియైయున్న గూర్మిసతిని.

24


శా.

అశ్వాకారము పూని యాత్మతనుదివ్యచ్ఛాయ పర్వంగ స
ప్తాశ్వుం డంచితపంచబాణవిశిఖవ్యాలీఢుఁడై యప్పు డ
య్యశ్వం జేరి తదీయభవ్యవదనం బాసక్తిఁ జుంబించెఁ దా
శశ్వద్విస్ఫుటహేషికాధ్వనుల నాశాభిత్తి కంపిల్లఁగన్.

25


వ.

పరమపతివ్రతాశిరోమణియైన నాసంజ్ఞయు నిజాంతఃకరణప్రవర్తనంబు
ప్రమాణంబుగా నక్కుహనాహయంబు సప్తహయుండ యని యంగీకరించి
నిలిచె నీతండును ననంగవశంవదుఁ డై తురగజాతిచేష్టలు కొన్ని నడిపి మావు
హత్తిన నత్తఱిఁం జరమధాతుద్రవోద్గమం బయ్యె. అందువలన రూపసంపన్నులగు
పుత్రులిద్దఱు నాసత్యు లనం బుట్టి స్వర్గలోకవైద్యులై రంత.

26


తమతమమునుపటిరూపులు, సముదారక్రీడఁ దాల్చి దంపతులు సము
ద్యమమున నిజవసతికిఁ జని, రమితప్రతిభాసమగ్రు లగుచు మునీంద్రా.

27


సీ.

తనతనూభవకు హితము చేయ మదిఁ గోరి, ఘనుఁడైన యావిశ్వకర్మ కమల
బంధునిఁ గరసానఁ బట్టి యష్టమభాగ, మరుగ వైష్ణవతేజమైననదియు
బుడమిపైఁ బడియు రాపొడి యైన నది గూర్చి, పూదెగాఁ గరఁగ నాపూదెలోనఁ
గొంత దానవకులధ్వాంతార్కనిభమైన, చక్రంబుచేసి శ్రీజాని కిచ్చెఁ


గీ.

గొంత శూలంబు చేసి భర్గునకు నిచ్చెఁ, గొంత శక్తిగఁ జేసి యగ్గుహున కిచ్చెఁ
గొంత సురకోటులకు నెల్లఁ గోరునాయు, ధముల నిర్మించి యిచ్చె నయ్యమరశిల్పి.

28


వ.

ఛాయాపుత్రుండైన మనువు పూర్వమనుసవర్ణుం డగుటం జేసి సావర్ణి యనం
బరఁగి యష్టమమను వగు. ఆమన్వంతరంబున నమితాభాదు లేకవింశతిదేవ
గణంబులు. దీప్తిమంతుండు, గాలవుండు, రాముండు, కృపుండు, ఆశ్వత్థామ,
వ్యాసుండు, ఋష్యశృంగుఁడు వీరలు సప్తర్షు లయ్యెదరు.

29


సీ.

ఏవీరవరుఁడు మహేంద్రాదుల జయించి, సకిలలోకములకు స్వామి యయ్యె
నేకర్మకుఁడు నిరుత్సేకుఁడై శాస్త్రోక్తి, నఖిలాధ్వరంబులు నాహరించె
నేపుణ్యుఁ డధికసుశ్రీపటుత్వమును బ్రా, హ్మణళయుక్తిచే నతిశయిల్లె
నేవదాన్యాగ్రణి శ్రీవధూనాథున, కవలీల భువనత్రయంబు నిచ్చె