పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సూర్యునిరథంబుపై వసియింతురు. వీరలు లోకప్రకాశనార్థంబు క్రమంబున
ద్వాదశమాసాధికారులై విష్ణ్యుశక్త్యుపబృంహితులై వసింతురు. అందు మునులు
నుతించుచు, గంధర్వులు పాడుచు, అచ్చర లాడుచు, రక్కసు లనువర్తించుచు,
పన్నగంబులు వహించుచు, గ్రామణులు పగ్గంబులు పట్టుచు వసియింతురు.
వాలఖిల్యులు పరివేష్టించి యుపాసింతురు. ఈయేడుతెఱఁగులవారును రవి
మండలఁబునందు నిలిచి హిమోష్ణవారివృద్ధులకుఁ దమతమసమయంబున
హేతువు లగుదురని చెప్పిన శ్రీపరాశరునకు మైత్రేయుం డి ట్లనియె.

149


సీ.

ధీరేంద్ర యీయేడుతెఱఁగులవారును, సరిజోదరదివ్యశక్తిబృంహి
తాత్ములై యాదిత్యులరదంబుపైనుండి, [1]శీతలోష్ణాంబువృష్టిముఖ్యకార్య
కారు లౌదురని వక్కాణించితిరి భానుఁ, డే శీతవాతాంబువృష్టులకును
హేతుభూతుఁ డని యెఱిఁగించితిరి, మును పిది సందియము దోఁచె నెఱుఁగఁ జెపుఁడ


గీ.

అదియుఁగాక భానుఁ డస్తమితుఁ డయ్యె, నుదితుఁ డయ్యె ననుచు నుర్విజనము
లెదురు చూడనేల యీపను ల్వీరలు, తీర్చిరేని దీనిఁ దెలుపవయ్య

150


వ.

అని యడిగిన మైత్రేయునకు శ్రీపరాశరుం డిట్లనియె.

151


క.

విను మెంద ఱున్నఁ గానీ, దినకరుఁడే ముఖ్యుఁ డతనితేజంబుననే
యొనగూడు నన్నిపనులును, జనవినుతము లగుచు నెపుడు జగములయందున్.

152


ఉ.

భూమిసురేంద్ర యిజ్జగముఁ బ్రోఁచుటకై విలసించు ఋగ్యజు
స్సామసమాఖ్యశ్రీవిభునిశక్తి యఘౌఘమ ద్రుంపఁజాలు ను
ద్దామమహావిభూతి నది తామరసాప్తునియందు నిల్చి ది
వ్యామృతవృష్టివాత, మిహికాదికకృత్యము తీర్చు నెప్పుడున్.

153


క.

రేపుల ఋఙ్నివహంబును, మాపుల సామవ్రజంబు, మధ్యాహ్నములన్
దీపితయజుస్స్తుతులును మ, హాపటిమ బొగడుచుండు నంబుజబంధున్.

154


వ.

సర్గాదియందు శ్రీమన్నారాయణుండు సృష్ట్యర్థంబు రజోగుణం బవలంబించి
ఋగ్వేదమయుండైన చతుర్ముఖుఁ డయ్యె. రక్షణార్థంబు సత్వగుణం బవలం
బించి యజుర్మూర్తియైన విష్ణుం డయ్యె. సంహారార్థంబు తమోగుణం బవలంబించి
సామస్వరూపియైన రుద్రుడం య్యె. కావున సామస్వరం బశుచి యయ్యె. ఏవం
విధమహిమగల విష్ణుశక్తి సత్వగుణస్థుండైన యాదిత్యు నధిష్ఠించి యుండి
వెలుంగంజేయు.

155


చ.

సమధికవిష్ణుశక్తిపరిసర్పితుఁడై సవితృండు ఘోరసం
తమసము బాఱఁద్రోలి భువనంబులు బ్రోచుచునుండుఁ గాని ని

  1. శీలాంభోష్ణవృష్టి