పుట:విక్రమార్కచరిత్రము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

విక్రమార్క చరిత్రము


క్కున విదిలించి, యందుఁ బదికోటులు మాడలు రాలఁ బ్రోవుగా
ననయము నెల్లయర్థులకు నన్నరపాలకుఁ డిచ్చు నిచ్చలున్.

18


క.

కనుఁగొనిన వేయి, మాటా
డినఁ బదివే, ల్గుడువ లక్ష, డెందము ప్రమదం
బునఁ బొందినఁ గోటిధనం
బనయము నర్థులకు విక్రమార్కుం డొసఁగున్.

19


వ.

ఇవ్విధంబున ననన్యసామాన్యవదాన్యుండైన యారాజన్యుండు, పేరోలగంబున రత్నసింహాసనాసీనుండై యున్నయవసరంబున, వైహాయసమార్గంబున ననర్గళమణిమరీచిమాలికాదేదీప్యమానంబులైన దివ్యవిమానంబుల నవలోకించి, యాత్మీయమిత్త్రుండైనచిత్రరథుం డనుగంధర్వపతి, నివి యెందుఁ జనుచున్న వని యడుగుటయు, నతం డాతని కిట్లనియె.

20


ఆ.

సకలజీవలోకసజ్జనానందన
ప్రౌఢుఁ డైనపద్మభవునిఁ గొల్వ
ననుదినంబు నరుగునమరేంద్రముఖ్యుల
మణివిమానము లివి మనుజనాథ.

21


వ.

అనవుడు.

22


విక్రమార్కుఁడు బ్రహ్మసభ కేగుట

మ.

జగదుత్పత్తివిశారదుం డయిన భాషాజానియాస్థానిసో
యగ మీక్షించునపేక్ష, నాక్షణమ భృత్యామాత్యు లంగీకరిం
ప, గుణాలోలుఁడు సాహసాంకధరణీపాలుండు, లీలాగతిన్
గగనాభోగ మలంకరించె మణిరంగత్పాదుకాపాదుఁడై.

23


వ.

ఇవ్విధంబునం జని యమ్మహామహుండు, పితామహలోకాలోకనోత్సవం బంగీకరించి, తదాస్థానమండపంబు ప్రవేశించి.

24


సీ.

మౌద్గల్య మాతంగ మౌంజాయన మరీచి
        మైత్రేయ మాండవ్య మందపాల