పుట:విక్రమార్కచరిత్రము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

విక్రమార్కచరిత్రము


త్తాలికుల మొక్కొ! నాఁగను
బాలిక నెన్నుదుటఁ గురులు భాసురమయ్యెన్.

47


తే.

ఒప్పులే యేఱి మాఱులేకుండ బ్రహ్మ
యంగకంబులు చేసే నం చాత్మ మెచ్చి
యవయవశ్రీలు గనుఁగొనునట్టి యిచ్చఁ
దరుణికన్నులు తలచుట్టుఁ దిరిగివచ్చు.

48


తే.

బయలఁ గనుపట్టునొంటికంబంబుమీఁదఁ
బసిడికుండలు నిల్పినభంగి దోఁప
ససదుఁగౌఁదీఁగెఁ బొలుపోగునారుమీఁద
వలుదనునుగుబ్బ లొప్పారు వనజముఖికి.

49


ఉ.

అంతటఁ గూర్మినందనవయఃపరిపాకము చూచి, తండ్రి య
త్యంతముదంబునం బొదలి, యంగజలక్ష్మియుఁబోలె నున్న యీ
కాంతకు, వంశశీలగుణగౌరవయౌవనరూవసత్కళా
వంతుఁడు కాంతుఁడైన, గరువంపుదపంబు ఫలంబు నొందుఁబో.

50


వ.

అని విచారించి సకలలోకజయధ్వజుం డగుధర్మజుండు, మదవదసహ్యరిపుకరటిసింహుం డగుసింహళేశ్వరకుమారుండు హేమాంగదుండు రూపవిజితమకరధ్వజుండగుట మున్ను వినియునికిం జేసి, తగినవారలం బుచ్చి రప్పించి బ్రియపూర్వకంబుగా గారవించి, శుభముహూర్తంబున నానృపకుంజరునకుఁ గామమంజరిని వివాహంబు చేసి, మణిగణోజ్జ్వలానేకవిరాజితోపచారంబులం బూజించి, యల్లునిఁ గూఁతు ననర్హ్యరత్నఖచితకనకమయమందిరంబున నుండ నియమించిన.

51


క.

రతియును గంతుఁడును, శచీ
సతియును నింద్రుండుబోలె, జలజాక్షియు భూ
పతియు సుఖాంబుధిఁ దేలుచుఁ
జతురత విహరించుచున్నసమయమునందున్.

52