పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

81


కాని సత్యంబు గా దట్లు గావున.

260


గీ

వస్తువస్తువునడుమఁ గేవలము బయలఁ
గలిగి యుండియు నేరికి గాన రాక
తెలివియును జాడ్యమును లేక వెలుగు నెద్ది,
యట్టిరూపంబు నీవు గ మ్మనఘచరిత.

261


చ.

మును పరమాత్మతత్త్వమున మున్కొని చిత్తము పుట్టుఁ, జిత్తస
న్మననవికల్పజాలమున మానుగఁ బుట్టి జగత్ప్రపంచ మెం
దును దలపోయ శూన్య మయి తోచుచునుండు, నభంబు నీలిమం
బని తలపోసినట్లు పరమార్థము గామి యెఱుంగు రాఘవా.

262


క.

జాలిన సంకల్పంబులఁ
జాలించినఁ జిత్త మణఁగి సంసారమహా
జలము సెడుఁ నంత శర
త్కాలవియద్భాతిఁ బరమతత్త్వము వెలుఁగున్.

263


వ.

అని లవణోపాఖ్యానంబు సెప్పి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె.

264

అజ్ఞానభూమికోపాఖ్యానము

సీ.

జననాథ యెఱుఁగు, మజ్ఞానభూమిక లేడు
        పొలుపొంది మనములోఁ బూని వెలుగు;
నేడింటిసందుల నేపారుభూములు
        గణనకు మిక్కిలి గలిగి యుండు;
నవి బంధమూలంబు లై ఫలియించుచుఁ
        జెప్పంగఁబడియె సంక్షేపభంగి;
మొగిని రాగ ద్వేషములఁ బాసి శుద్ధసం
        విన్మాత్రచిత్తంబు విడువ నీక


గీ.

జాడ్యనిద్ర లుడిగి సంకల్పములఁ బాసి
శిలయుఁ బోలె నొండుతలఁపు లేక