పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాసిష్ఠరామాయణము

పంచమాశ్వాసము

క. శృంగారాకారశ్రీ
     సంగతదివ్యాంతరంగ సరసిజనిలయా
     లింగితవక్ష యహోబల
     శృంగస్థలనటనరంహ శ్రీనరసింహా.1

నిర్వాణప్రకరణము

.

వ. దేవా పరమతత్త్వార్థవివేకి యగు వాల్మీకి భరద్వాజున కి ట్లనియె. న ట్లు
     పశమునప్రకరణం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రుం గనుంగొని౼
     యీయర్థంబునకు ఫలంబు నిర్వాణంబ యని సెప్పంబడు. నందు
     భుసుండ, దేవపూజ, బిల్వ, శిలాఖ్య, అర్జున, శతరుద్ర, బేతాళ
     భగీరథ, శిఖిధ్వజ, కిరాత, చింతామణి, గజ, చూడాల, కచ, మిథ్యా
     పురుష, భృంగి ఇక్ష్వాకు, వ్యాధ,యోగభూమికోపాఖ్యానంబులన
     జీవన్ముక్తివర్ణితంబు లగునితిహాసంబు లేకోనవింశతి యుండు. నందు
     ప్రణవధ్యానంబునం జిత్తవిశ్రాంతి గలుగుట భుసుండోపాఖ్యానంబు
     నం జప్పంబడు, నవ్విధం బాకర్ణింపుము.2
గీ. దేహములయందు నహమిక, దృశ్యసమితి
     యాత్మ యనుటయు, వస్తువులందు మమత,
     యలమి యెందాఁక వర్తించు నంతదాఁకఁ
     బాయ దెప్పుడు చిత్తవిభ్రమము వత్స.3
క. విను మంతర్ముఖుఁ డై జగ
     మను తృణముఁ జిరగ్నియందు నాహుతిగాఁ దా