పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

తదనంతరంబ కృతిపతికిం బతి యైనసాళువనరసింగరాజరాజమౌళిపావనాన్వ
యంబు మొదల వర్ణింతుము చింతారత్నకామగవికల్పవృక్షలక్ష్మీపక్ష్ములాక్షులతోడం
బుట్టి మిన్నుముట్టినపాలమున్నీటిపట్టి సాయంతనసమయసంఫుల్లమల్లీమతల్లికాగుళు
చ్ఛస్వచ్ఛకాంతినిస్తంద్రుండు చంద్రుండు వంశకర్తగా సకలకలికలుషాపహర్త
వంకిదేవమహీధర్తకీర్తికార్తికచంద్రికాప్రభావంబులు వినిర్మించి దశదిశాంచలం
బులు ముంచెఁ దత్తనూజుండు చతుష్షష్టివిద్యావినూతనభోజుండు గుండ్రాజు దుం
డగపురాచతండంబులఁ జెండాడి మండలగ్రావంబుకెలంకుల గెలుపుఁగంబంబులు
నిలిపెఁ దత్సూనుండు గాండివధన్వసమానుండు సాళువరాజు ఘోరాహవహట్టంబు
నం బారసికతురగధట్టంబులం గనుపుగొట్టి ధరావరారోహబాహుపీఠంబునం
గుదురుపఱచెఁ దత్పుత్త్రుండు నిరాతంకప్రతాపకమలమిత్రుండు గౌతరాజు రాజు
సంబున గుణలతావితానంబులు సేతుశీతాచలమధ్యపృథ్వీమండలంబున మెండు
గొలిపెఁ దత్సుతుండు వీరలక్ష్మీసమన్వితుండు గుండరాజు వీరోధిరథినీవిఖండన
ప్రచండదోర్దండమండలాగ్రుండును సముద్దండసాహసక్రియాసమగ్రుండును నై
నిరవధికప్రభావదుందుమారులం దిమ్మనాథనరసింగపార్థివులం గాంచె వారిలోన.

20


సీ.

తుహినాంశువంశపాధోరాశిమాణిక్య మష్టదిగ్రాజభయంకరుండు
కర్ణాటరాజ్యరక్షణదక్షబాహాసి వరవసంతత్యాగవైభవుండు
శివరాత్రిసమయసంశీలతాగుణశాలి ధరణీసుపర్వనిస్తారకుండు
విరచితాతులతులాపురుషదానవిభూతి సమదరాయకటారిసాళువంబు
గుండవిభునారసింహభూమండలేశ్వ, రుండు గణుతింప రాజమాత్రుండు గాఁడు
కిన్నరస్త్రీసమూహజేగీయమాన, వర్తనంబులు గలచక్రవర్తిగాని.

21


మహాస్రగ్ధర.

నరసింగస్వామి రంగన్నగనిభగజగంధర్వపాదాతసైన్య
స్ఫురణాసంపత్తి విద్విట్పురములు బలిమిం బూని కాల్పంగ ధూమో
త్కరముల్ కాదంబినీమార్గము నిబిడముగాఁ గప్పి మందాకినీపు
ష్కరముల్ భానూద్భవాపుష్కరములకరణిం గానిపింపంగఁ జేయున్.

22


శా.

పోలున్ భార్గవరాముతోడ ననుచున్ భూషింప వేలాపరీ
తేలామండల మాధరాధరముగా నేకాతపత్రంబుగా
నేలున్ సాళువనారసింహుఁడు భుజంగేంద్రాద్రిపై నున్నల
క్ష్మీలావణ్యసరోమరాళము చిరశ్రీవృద్ధి గావింపఁగన్.

23


వ.

అట్టినరసింగరాజరత్నంబుచేత మన్నన వడసి సైన్యనాయకపట్టభద్రత్వంబున
నిర్నిద్రవిజయలక్ష్మీమహత్త్వంబున మదవదభియాతిభయదసత్వంబున దీర్ఘాయు