పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఇట్లు చూచి విశాలనరేశ్వరుండు, మీకు నామంబు లెవ్వి యేమిటికి మీరు
వచ్చితిరి నాకుఁ జెప్పంగ వలయు ననినఁ, జెప్పె నిట్లని వారిలో సితతనుండు.

96


క.

నను సితుఁ డందురు ధాత్రీ, జనులు శరత్కాలచంద్రసన్నిభవర్ణం
బున సత్కర్మంబున వ, ర్తనమున నే నిన్నుఁ గన్నతండ్రిం దండ్రీ.

97


శా.

కూపెట్టంగ మహీసుపర్వులమెడల్ గోసెం బరస్త్రీరతిం
బ్రాపించెన్ సుకృతంబుత్రోవకుఁ బెడంబాసెం ధనాదానసం
ధాపారుష్యముతోడ సాధుజనులన్ బాధించె రక్తాంగకుం
డీపాపాత్ముఁడు నీపితామహుఁడు సుమ్మీ వంశవిస్తారకా.

98


గీ.

వెఱపు లేక నఱకి నఱకి దోర్దండకృ, పాణిమీఁద శత్రుశోణితంబు
చాయ నిలిపి తాఁ దదీయకాళిమ దాల్చె, ననఁగఁ గృష్ణవర్ణుఁ డయ్యెఁ బుత్ర.

99


వ.

అధీశ్వరనామధేయుం డితండు భవత్ప్రపితామహుం డని క్రమఁబునఁ దమ
మువ్వరసంబంధరూపవర్తనంబులు దెలియం బలికి సితుండు వెండియుం దనపితృ
పితామహుల నుద్దేశించి వీర లిద్దఱు దారు చేసినదుష్కరంబునఁ బెద్దకాలంబు
వీచీనామఘోరనరకంబునం గూలిరి నాచేసినసుకర్మఫలంబున నేను దుర్లభం బైన
శక్రాసనంబున నుండితి మహాత్మా సకలమంత్రసంవేది వైననీవు గయాక్షేత్రంబున
నిప్పుడు పిండప్రదానసముచితోదకతర్పణసమయంబునం బితృపితామహప్రపితా
మహులు తృప్తు లగుదురు గాక యని పలికినపలుకుమహత్వంబున నరకవిముక్తు
లైనవీరును శక్రాసనస్ధుండ నైనయేనునుం బితృలోకంబునకుఁ బోవ నుద్యోగించి
నిన్నుం జూడ నిక్కడం గూడితిమి యిది మదీయవృత్తాంతంబు.

100


చ.

కలసిరి ముక్తికల్మషవికారవివర్ణులు ఘోరనారక
స్టులు నగువీరు సైతమును సువ్రత నీవు మదన్వయంబునం
గలిగితి గాన సత్సుతులఁ గాంచినవారలభాగ్యముల్ గయా
స్థలకృతపిండదానఫలసంపదయున్ వినుతింప శక్యమే.

101


గీ.

అని ప్రశంసించి వారుఁ దానును సితుండు, వోయె ధన్యాతులార విచ్చేయుఁ డనుచుఁ
బలుకునందనుతియ్యనిపలుకు చెవులు, సోక నతిలోక మగుపితృలోకమునకు.

102


క.

కావునఁ బితరులగూర్చి య, థావిధి జపహోమపిండదానతపంబు
ల్గావించితి గయ ననిశము, నీవు గృతార్ధుఁడవు గావె నిర్మలచరితా.

103


క.

సారంబు నీతపస్సం, భారము నిజ మని సనత్కుమారుఁ డదృశ్యా
కారుం డగుటయు రైభ్యుఁడు, చేరి గదాధరుని వినుతి చేయం దొడఁగెన్.

104